స్టార్ హీరో బాలయ్య మనస్సు మంచి మనస్సు అనే సంగతి తెలిసిందే.బాలయ్య తారకరత్న పేరు చరిత్రలో నిలిచేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
హృదయ సంబంధిత సమస్యలతో తారకరత్న( Tarakaratna ) మృతి చెందిన నేపథ్యంలో బాలయ్య గుండె సంబంధిత సమస్యలు ఉన్న పేదలకు ఉచితంగా చికిత్స అందేలా చేయడంతో పాటు హిందూపురంలో సొంత డబ్బులతో నిర్మిస్తున్న హెచ్ బ్లాక్ కు తారకరత్న పేరు పెట్టారని ప్రచారం జరుగుతోంది.తన కుటుంబంలో వచ్చిన కష్టం మరెవరికీ రాకూడదని ఆయన భావిస్తున్నారని సోషల్ మీడియాలో పోస్టులు ప్రచారంలోకి వచ్చాయి.
పేదల కొరకు దాదాపుగా కోటిన్నర రూపాయలతో సర్జికల్ పరికరాలను సైతం బాలయ్య ఏర్పాటు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.ఈ ఆస్పత్రిలో చిన్నపిల్లలకు మందులు ఇవ్వడంతో పాటు ఉచితంగా భోజనం అందుబాటులో ఉంటుందని వినిపిస్తోంది.
బాలయ్య తన సంపాదనలో ఎక్కువ మొత్తాన్ని సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తుండటం గమనార్హం.
అయితే ఈ విషయాలకు సంబంధించి ప్రచారం చేసుకోవడానికి మాత్రం బాలయ్య( Balakrishna ) ఇష్టపడటం లేదు.అయితే వైరల్ అవుతున్న ఈ వార్తలను బాలయ్య ఎక్కడా ధృవీకరించలేదు.బాలయ్య సన్నిహితులను ఈ వార్త గురించి సంప్రదించగా వైరల్ అవుతున్న విషయాల గురించి బాలయ్య స్పష్టత ఇచ్చేవరకు ఆగాలని చెబుతున్నారు.
కొన్నిసార్లు బాలయ్యకు తెలియకుండానే ఫేక్ వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయని వాళ్లు అభిప్రాయపడుతున్నారు.తారకరత్న పేరు చరిత్రలో నిలిచేలా ఎన్నో పనులు చేయాలని బాలయ్య భావిస్తున్నారని అయితే బాలయ్య ఏం చేసినా స్వయంగా చెబుతారని వాళ్లు అభిప్రాయపడుతున్నారు.
ఈ వార్త గురించి బాలయ్య నుంచి మరికొన్ని గంటల్లో స్పష్టత వస్తుందేమో చూడాలి.
బాలయ్య తర్వాత ప్రాజెక్ట్ లు సైతం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయని మాస్ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లా ఈ సినిమాలు ఉండనున్నాయని సమాచారం.బాలయ్య అనిల్ కాంబో మూవీకి సంబంధించి త్వరలో షాకింగ్ అప్ డేట్స్ రానున్నాయని తెలుస్తోంది.బాలయ్య అనిల్( Anil Ravipudi ) కాంబో మూవీ 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది.
బాలయ్యను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.