సూపర్ స్టార్ కృష్ణ తన సినీ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు.79 సంవత్సరాల వయస్సులో అనారోగ్య సమస్యల వల్ల కృష్ణ మృతి చెందారు.ప్రముఖ జర్నలిస్ట్ ఇమంది రామారావు కృష్ణ గురించి మాట్లాడుతూ ఏఎన్నార్, కృష్ణ మధ్య సత్సంబంధాలు ఉండేవని అన్నారు.కృష్ణగారు పలు సినిమాలకు దర్శకత్వం వహించడంతో పాటు ఎడిటర్ గా కూడా వ్యవహరించారని ఇమంది రామారావు అన్నారు.
కృష్ణగారు చాలా స్పీడ్ అని ఆయన కామెంట్లు చేశారు.ప్రతి పనిని ఆయన వేగంగా చేసేవారని ఇమంది రామారావు పేర్కొన్నారు.
అలా చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని ఇమంది రామారావు చెప్పుకొచ్చారు.షాట్ ఎక్కడివరకు కట్ చేస్తే అందంగా ఉంటుందో కృష్ణకు బాగా తెలుసని ఆయన అన్నారు.
స్టాఫ్ కు పని కల్పించాలనే ఆలోచనతోనే పద్మాలయ స్టూడియోస్ ను నిర్మించడం జరిగిందని ఆయన కామెంట్లు చేశారు.
సినిమాల్లో కృష్ణ వేగం చూసి హిందీ వాళ్లు సిగ్గుపడేవారని ఆయన చెప్పుకొచ్చారు.
పంచాయితీ సినిమాలో ఆయన 12 రోజుల్లో నటించారని ఇమంది రామారావు పేర్కొన్నారు.కృష్ణగారికి భారీ స్థాయిలోనే ఆస్తులు ఉన్నాయని ఆయన కామెంట్లు చేశారు.పద్మాలయ స్టూడియోస్, కృష్ణగారి ఇళ్లు 15 కోట్ల రూపాయలకు బ్యాంక్ వేలం పాటకు రాగా మహేష్ రంగంలోకి దిగి హామీ ఇచ్చి వేలంపాట ఆపారని ఆయన చెప్పుకొచ్చారు.
కుటుంబానికి సంబంధించిన అన్ని బాధ్యతలను ప్రస్తుతం మహేష్ బాబు తీసుకున్నారని ఆయన కామెంట్లు చేశారు.రాబోయే రోజుల్లో మహేష్ బాబు కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా దేవుడు మహేష్ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.