ఏపీ (AP) సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.
ఇకనుంచి వాహనదారులు హెడ్ సెట్( Headset ) పెట్టుకొని వాహనాలు నడిపితే జరిమానా విధిస్తామని తెలియజేసింది.
దీనికి సంబంధించి రవాణా శాఖకు ఉత్తర్వులు జారీ చేసింది.మరి ఆ వివరాలు ఏంటో చూసేద్దాం.
రాష్ట్రంలో ప్రతిరోజు ఎన్నో ప్రమాద ఘటనలు జరుగుతున్నాయి.ఇందులో ఎక్కువ శాతం ఘటనలు వాహనదారుల నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయని భావించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది.
అయితే కొంతమంది నిర్లక్ష్యంగా చెవిలో హెడ్ సెట్ పెట్టుకొని వేగంగా వాహనాలు నడుపుతూ ప్రమాదానికి కారణం అవుతున్నారు.దీనివల్ల చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ఆ ప్రమాదాలను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP GOVT) ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఇకనుంచి డ్రైవింగ్(Driving) చేస్తూ ఇయర్ ఫోన్స్, హెడ్ సెట్ పెట్టుకొని పట్టుపడితే మాత్రం రూ:20వేల జరిమానా ఉంటుందని తెలియజేసింది.ఈ నిర్ణయానికి సంబంధించి రూల్స్ ఆగస్టు నెల నుంచి ప్రారంభమవుతాయని తెలిపింది.ఈ రూల్స్ కు(Rules) సంబంధించి మొత్తం వివరాలను రవాణా శాఖకు జారీ చేసినట్టు విశ్వసనీయ సమాచారం.
ప్రస్తుతం ఏపీ గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కొంతమంది ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటే,మరో కొంత మంది ప్రజలు ప్రభుత్వంపై(Government) మండిపడుతున్నారు.మరి చూడాలి ఈ రూల్స్ అమలయ్యాక ఏ విధమైనటువంటి స్పందన లభిస్తుందో ముందు ముందు తెలుస్తుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002[email protected]Ph No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy