సీనియర్ హీరో రాజశేఖర్ ఇద్దరు కుమార్తెలు హీరోయిన్స్ గా ఇండస్ట్రీ కి పరిచయమైన విషయం తెలిసిందే.మొదటగా చిన్న కుమార్తె శివాత్మిక రాజశేఖర్( Shivatmika Rajasekhar ) దొరసాని చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన విషయం తెలిసిందే.
ఆ తర్వాత శివాత్మిక కూడా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది.ఇద్దరు హీరోయిన్స్ ఇప్పటి వరకు ఒక్క సక్సెస్ కూడా సొంతం చేసుకోలేక పోయారు.
అయితే శివాత్మిక రాజశేఖర్ నటించిన రంగమార్తాండ ( Rangamarthanda )సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.అయితే అది కమర్షియల్ విజయం కాక పోవడంతో రాజశేఖర్ కి ఎంత వరకు వరుసగా అవకాశాలు వస్తాయనేది వేచి చూడాల్సిందే.
ప్రస్తుతానికి కమర్షియల్ పాత్రలకు దూరంగా ఉంటున్న శివాత్మిక రాజశేఖర్ త్వరలోనే కమర్షియల్ పాత్ర లో కూడా నటించాలని ఆశ పడుతుంది, తెలుగు లో కాకుండా ఇతర భాషలో అయినా ఈ ముద్దుగుమ్మ నటించాలని కోరుకుంటుంది.ఇప్పటి వరకు తెలుగు లో కమర్షియల్ పాత్రలు దక్కక పోయినా తనకు వచ్చిన పాత్రలతో నటన లో మంచి గుర్తింపు లభించింది.అందుకే శివాత్మిక రాజశేఖర్ ముందు ముందు అయినా తప్పకుండా స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగే అవకాశం ఉందని తెలుస్తుంది.ప్రస్తుతానికి రంగమార్తాండ సినిమా తో ఈమె కు పెద్దగా ఒరిగింది ఏమీ లేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఆ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేయడం వల్ల ఇమేజ్ డ్యామేజ్ అయిందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.హీరోయిన్ గా జీవిత ఎన్నో సూపర్ హిట్స్ చిత్రాల్లో నటించిన విషయం తెల్సిందే.
ఆమె వారసత్వంతో పునికి పుచ్చుకుని హీరోయిన్స్ గా సక్సెస్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్న ఇద్దరు కుమార్తెలు కూడా ప్రస్తుతానికి కొత్త సినిమాలు ఏమీ చేయడం లేదు.రాబోయే రోజుల్లో అయినా శివాత్మిక మరియు శివానీ లు హీరోయిన్స్ గా సక్సెస్ అవుతారేమో చూడాలి.