సాక్షి శివానంద్ పై హత్యాయత్నం కేసు,పెట్టింది ఎవరో కాదు!

ఒకప్పుడు వెండితెర ను అలరించిన హీరోయిన్స్ లో సాక్షి శివానంద్ ఒకటి.సాక్షి శివానంద్ మీకు గుర్తు ఉండే ఉంటుంది.

దాదాపు పెద్ద హీరోలు అందరితో కూడా ఆమె నటించింది.నాగార్జున,చిరంజీవి,మోహన్ బాబు ఇలా చాలా మంది పెద్ద హీరోలతో చేసిన సాక్షి ఆ తరువాత తన సోదరి సాక్షి ఆనంద్ ని వెండితెరకు పరిచయం చేసింది.

మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు తోలి చిత్రంలో సాక్షి ఆనంద్ హీరోయిన్.అయితే ఆ చిత్రం సమయంలో ఏవో రూమర్స్ కూడా వచ్చాయి.

లిప్ కిస్ ఇవ్వాలి అంటూ తమను బెదిరించారని, ఇంకా ఎన్నో ఆరోపణలు చేస్తూ సాక్షి శివానంద్ వార్తల్లో నిలిచింది.అయితే ఇప్పుడు తాజాగా ఆమె పైనే సాక్షి సోదరి పోలీస్ కేసు నమోదు చేసింది.

Advertisement

తనను చంపడానికి నా అక్క,ఆమె అత్త ప్రయత్నిస్తున్నారు అంటూ వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది.తన భీమా డబ్బు కోసమే వారు ఇలా చంపేందుకు ప్రయత్నిస్తున్నారు అని,ఈ కేసు ఫైల్ చేసే సమయానికి వారు ఇక్కడ ఉండకుండా విదేశాలకు పారిపోయారు అంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

మరి ఆ రోజున తోలి చిత్రంలో సోదరి ఇబ్బందులు ఎదుర్కొంది అంటూ ఆరోపణలు చేసి అంత సపోర్ట్ గా నిలిచిన సాక్షి శివానంద్ పై ఇప్పుడు ఆ సోదరే ఆమె పై హత్యాయత్నం కేసు నమోదు చేయడం విశేషం.మరి మొత్తానికి ఏమి గొడవలో తెలియదు కానీ ఈ వివాదం తో మరోసారి సాక్షి వార్తల్లో నిలిచింది.

Advertisement

తాజా వార్తలు