టీ20 సీరీస్‌ నుండి ధావన్ ఔట్

టీమిండియా ఓపెనర్‌ శిఖర్ ధావన్ మరోసారి టీ20 సీరీస్‌కు దూరం అయ్యాడు.వెస్టిండీస్‌తో భారత్ తలపడనున్న టీ20 సీరీస్‌ డిసెంబర్ 6 నుంచి జరగనుండగా భారత జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్ గాయం కారణంగా టీ20 సిరీస్ నుండి వైదొలిగినట్లు బీసీసీఐ ప్రకటించింది.

 Shikhar Dhawan Out Of Ind Vs Wi T20 Series-TeluguStop.com

ఇటీవల జరిగిన ముస్తాక్ అలీ ట్రోఫీ టీ20 మ్యాచులో శిఖర్ ధావన్ ఎడుమ మోకాలికి గాయం కావడంతో అతడు విండీస్ టీ20 సిరీస్‌కు దూరం కానున్నట్లు బీసీసీఐ అధికారులు తెలిపారు.

అయితే అతడి స్థానంలో యువ ఆటగాడు సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకున్నట్లు భారత క్రికెట్ బోర్డు తెలిపింది.

మరోవైపు డిసెంబర్ 15 నుండి జరిగే వన్డే సిరీస్‌కు ధావన్ అందుబాటులో ఉండవచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది.ఇక విండీస్‌తో జరిగే టీ20 సిరిస్‌కు భారత వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా కుడి చేతి వేలికి గాయం కావడంతో అతడికి కూడా విశ్రాంతిని ఇచ్చారు.

ఇక విండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌లో భారత జట్టు ఈ విధంగా ఉంది.విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, రిషబ్ పంత్(వికెట్ కీపర్), శివం దూబే, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, దీపక్ చాహర్, మోహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, సంజూ శాంసన్(వికెట్ కీపర్).

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube