యాంకర్ : ప్రకాశం జిల్లా( Prakasam District ) దర్శిలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది.పొదిలి నుండి ఓ పెళ్ళి రిసెప్షన్ కు బయల్దేరిన ఇంద్ర బస్సు దర్శి( Darshi ) లోని పెద్ద కాలువ వద్దకు రాగానే అదుపుతప్పి కాలువలో బోల్తా పడింది.
ఈ ఘటనలో ఒక చిన్నారితో కలిపి ఏడుగురు మృతి చెందగా, పలువురికి తీవ్రగాయాలయ్యాయి.విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
జేసిబితో బస్సును బయటకు తీసిన పోలీసులు క్షతగాత్రులను దర్శి, ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రు( Ongole Government Hospital )లకు తరలించారు.ప్రమాద సమయంలో బస్సులో 37మంది వరకు ఉన్నట్టు తెలుస్తోంది.
వీరంతా కాకినాడ లోని ఒక పెళ్ళి రిసెప్షన్ కు వెల్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.ఘటనలో మృతిచెందిన వారి వివరాలు అబ్దుల్ అజీస్ 65, అబ్దుల్ హాని 60,షేక్ రమిజ్ 48, ముల్లా నూర్జహాన్ 58, ముల్లా జానీ బేగం 65, షేక్ షాభినా 35, షేక్ హీనా
.






