ఢిల్లీ లిక్కర్ స్కాంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈడీ, సీబీఐ కేసులు పెట్టడం బీజేపీకి కొత్త కాదన్నారు.
ఏ విచారణను అయినా ఎదుర్కొంటామని ఆమె స్పష్టం చేశారు.జైల్లో పెడితే పెట్టుకోండి.
ఏమవుతుంది అని అన్నారు.కేసులకు భయపడమన్న కవిత.
మీడియాలో లీకులు ఇచ్చి ఇమేజ్ దెబ్బతీయలేరని పేర్కొన్నారు.ప్రజలు తమ వెంటే ఉన్నారని తెలిపారు.
మోదీ ఎనిమిది సంవత్సరాలలో 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టి అధికారంలోకి వచ్చారని విమర్శించారు.మోదీ వచ్చే ముందు ఆ రాష్ట్రానికి ఈడీ వెళ్తోందని వెల్లడించారు.
తెలంగాణలో వచ్చే డిసెంబర్ లో ఎన్నికలు ఉన్నాయి.అందుకే మోదీ కంటే ముందు తెలంగాణకు ఈడీ వచ్చిందని ఆరోపించారు.