రెండు తెలుగు రాష్ట్రాలలో స్వర్గీయ ఎన్టీఆర్ శతజయంతి దినోత్సవ వేడుకలు జరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ వేడుకలను నందమూరి కుటుంబం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది.
ఈ వేడుకలలో భాగంగా ఎన్టీఆర్ కి సంబంధించి రకరకాల కార్యక్రమాలు నందమూరి కుటుంబం నిర్వహిస్తూ ఉంది.ఈ క్రమంలో తాజాగా ప్రముఖ సినీ నటి సీనియర్ హీరోయిన్ జయప్రదకు ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కారం ప్రధానం చేశారు.
ఆదివారం గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన కార్యక్రమంలో ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ జయప్రదకు పురస్కారం అందించడం జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడిన జయప్రద… ఎన్టీఆర్ భౌతికంగా మన మధ్య లేకున్నా గాని.
అందరి హృదయాల్లో ఆయన బతికే ఉన్నారు.అటువంటి ఆయన పేరుతో చలనచిత్ర పురస్కారం తీసుకోవటం నా జీవితంలో ప్రత్యేకమైన అధ్యాయమని జయప్రద తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఎన్ వి ఆర్ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సినీ రాజకీయ ప్రముఖులు మరియు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర సెలబ్రేషన్స్ జరిగాయి.
ఈ కార్యక్రమంలో జయప్రద తో పాటు పలువురికి ఎన్టీఆర్ అవార్డులతో సన్మానించారు.ఈ క్రమంలో డాక్టర్ మైధిలి అబ్బరాజుకి ఎన్టీఆర్ అభిమాన అవార్డు అందజేశారు.
ఇక ఇదే కార్యక్రమంలో సూపర్ స్టార్ కృష్ణకు ఘన నివాళి అర్పించారు.