కలెక్షన్ల పండుగ చేసుకుంటున్న సాయి తేజ్....

మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన "ప్రతి రోజూ పండగే" మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ టాక్ తో దూసుకుపోతుంది.

ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు మారుతి దర్శకత్వం వహించగా రాశి కన్నా, సత్య రాజ్, రావు రమేష్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.

ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ వారు కలిసి సంయుక్తంగా నిర్మించారు.

అయితే ఈ చిత్రం ఈ నెల 20వ తారీఖున విడుదలయి మంచి కలెక్షన్లు సాధిస్తోంది.ఈ చిత్రం విడుదలై అప్పటి రోజు నుంచి నేటి వరకూ 23.25 కోట్ల రూపాయల గ్లాస్ ను వసూలు చేసింది.ఇందులో ముఖ్యంగా నైజాం ఏరియాలో 3.70 కోట్లు, యూస్ లో  $200 వేల డాలర్లు రాబట్టింది.మొత్తానికి మూడు రోజుల కలెక్షన్ చూసుకుంటే సాయి తేజ కెరియర్లోనే ఇప్పటివరకూ మంచి వసూళ్లు రాబట్టింది ఈ చిత్రం.

అంతేగాక మంచి ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్ టైనర్ కావడంతో మంచి ప్రేక్షకాదరణ లభిస్తోంది.ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 800 థియేటర్లలో పైగా ప్రదర్షింపబడుతోంది.  దీంతో దర్శక నిర్మాతలు కూడా ఈ వారంతానికి ఈ వసూళ్లు ఇంకా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

తాజా వార్తలు