అభిమానుల ప్రేమను చూసి కన్నీళ్లు పెట్టుకున్న సాయి పల్లవి!

సాధారణంగా హీరోహీరోయిన్లకి ఎంతోమంది అభిమానులు ఉంటారు.

ఈ క్రమంలోనే వారి అభిమాన సెలబ్రిటీ గురించి మాట్లాడుతుంటే పెద్ద ఎత్తున ఈలలు వేస్తూ కేకలు వేసి గోల చేస్తుంటారు.

ఈ క్రమంలోనే తమ అభిమానులు తన పట్ల చూపిస్తున్న ప్రేమను చూసి నేచురల్ బ్యూటీ సాయిపల్లవి కన్నీళ్లు పెట్టుకున్నారు.ప్రస్తుతం సాయి పల్లవి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో నాని సరసన శ్యామ్ సింగరాయ్ అనే చిత్రంలో నటించారు.

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఎంతో ఘనంగా జరిగింది.ఈ వేడుకలో భాగంగా చిత్రబృందం పాల్గొని ఈ సినిమా గురించి పెద్ద ఎత్తున ప్రమోట్ చేశారు.

ఇదిలా ఉండగా తాజాగా ప్రీ రిలీజ్ వేడుకలో నటి సాయి పల్లవి ఎమోషనల్ అయ్యారు.ఇక వేదిక పైకి సాయి పల్లవి మాట్లాడుతుండగానే అభిమానులు పెద్ద ఎత్తున ఈలలు కేకలు వేయడంతో ఒక్కసారిగా సాయి పల్లవి ఎమోషనల్ అవుతూ స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్నారు.

Advertisement

సాధారణంగా ఒక సెలబ్రిటీ పట్ల అభిమానం ఉంటుంది అనే విషయం మనందరికీ తెలిసిందే.

కానీ సాయిపల్లవి పేరు వినగానే తన అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమకు సాయిపల్లవి ఎమోషనల్ అయ్యారు.ఇలా సాయి పల్లవి ఏడవటంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇకపోతే ఈ సినిమా డిసెంబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇందులో నాని ద్విపాత్రాభినయంలో నటించగా సాయి పల్లవి కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనే ? 
Advertisement

తాజా వార్తలు