సాయి ధరమ్ తేజ్ హీరో గా సంయుక్త మీనన్( Samyuktha Menon ) హీరోయిన్ గా రూపొందిన విరూపాక్ష చిత్రం రూ.100 కోట్ల కలెక్షన్స్ కి చేరువయ్యింది.ఇటీవలే హిందీ మరియు తమిళ ప్రేక్షకుల ముందుకు విరూపాక్ష చిత్రం( Virupaksha ) వెళ్ళిన విషయం తెలిసిందే.తెలుగు లో ఈ సినిమా కు భారీ కమర్షియల్ సక్సెస్ లభించింది.
దాంతో హిందీ మరియు తమిళ భాషల్లో ఈ సినిమా ను విడుదల చేయడం జరిగింది.
ఇప్పటికే రాబట్టిన కలెక్షన్స్ నేపథ్యం లో అక్కడ వస్తున్న కలెక్షన్స్ తో కలిపి విరూపాక్ష 150 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేయబోతోంది అంటూ మెగా అభిమానులు( Mega Fans ) చాలా ధీమా తో ఉన్నారు.తెలుగు రాష్ట్రాల నుండి కలెక్షన్స్ దాదాపుగా డ్రాప్ అయినట్లే కనిపిస్తోంది.ఈ వారం వచ్చిన సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడం లో విఫలమయ్యాయి.
కనుక విరూపాక్ష చిత్రం ఒక మోస్తరుగా కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది.కానీ భారీ షేర్ ని మాత్రం రాబట్ట లేక పోతుంది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమయం లోనే భారీ అంచనాల నడుమ రూపొందిన సినిమాలను సైతం వెనక్కి నెట్టి హిందీ మరియు తమిళ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ నమోదు చేసిన కారణంగా త్వరలోనే ఈ సినిమా 150 కోట్ల రూపాయల క్లబ్( 150Crore Club ) లో జాయిన్ అయ్యే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు.ఈ మధ్య కాలంలో సౌత్ సినిమా లు( South Films ) హిందీ లో భారీ గా వసూళ్లు నమోదు చేస్తున్నాయి.కనుక ఎలాంటి డౌట్ అక్కర్లేకుండా విరూపాక్ష చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగా ఉత్తర భారతంలో భారీగా వసూళ్లు నమోదు చేసి ఆ అరుదైన రికార్డును సొంతం చేసుకుంటుందని అంటున్నారు.ఏం జరుగుతుందో చూడాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.