రుద్రమదేవి తన కలల సినిమాగా చెప్పిన గుణశేకరుడు ఇప్పుడు ఖాళీగా కనిపిస్తున్నాడు, సర్వస్వం ధారబోసి ఈ సినిమా ని తీసి పరవాలేదు అనిపించే రిజల్ట్ తో బయటకి వచ్చిన గుణశేకర్ ఈ సినిమాకి వందకోట్లు రాబట్టాం అని చెప్పుకొచ్చారు.
నిజంగా వందకోట్లు రాబట్టారా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.
భయంకరమైన పబ్లిసిటీ ని వాడి ఒక పక్క సింపతీ కూడా గెయిన్ చేసి జనాలని థియేటర్ లలోకి రప్పించడం లో గుణ సక్సెస్ అయ్యాడు అనే చెప్పాలి.వంద కోట్ల మార్కు దాటితే ఇంత సైలెంట్ గా ఉంటారా ఎవరైనా ? పైగా అంతకు మించి, తన బాకీలు అన్నీ తీర్చేసి,మిగిలిన లాభంతో మరో సినిమాకు శ్రీకారం చుట్టేవాడేగా.
ఎందుకు సైలెంట్ గా వుంటాడు? పైగా ప్రతాపరుద్రుడు సినిమా తీస్తానని కూడా అన్నాడుగా.బహుశా తన ప్రయత్నం ఫెయిల్ కాలేదు.
వంద కోట్ల వసూళ్లు తెచ్చింది అని చెప్పి, సంతృప్తి పడుతున్నాడేమో గుణశేఖర్.