కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని రూ.75 నాణెం విడుదల చేయనుంది.
ఈ క్రమంలో రూ.75 కాయిన్ త్వరలోనే మార్కెట్ లోకి రానుంది.కాగా సుమారు 35 గ్రాముల బరువుతో 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం జింక్ తో దీనిని తయారు చేయనున్నారని తెలుస్తోంది.
అదేవిధంగా అశోక స్తంభంపై ఉండే నాలుగు సింహాల చిహ్నంతో పాటు లయన్ క్యాపిటల్ కింద సత్యమేవ జయతే అని రాసి ఉండనుందని సమాచారం.ఈ మేరకు కాయిన్స్ ను విడుదల చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.కాగా ప్రస్తుతం మార్కెట్ లో రూ.1, రూ.2 తో పాటు రూ.5 కాయిన్లు వాడకంలో ఉన్న సంగతి తెలిసిందే.