మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR)లు ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా తర్వాత గ్లోబల్ వైడ్ గా పాపులర్ అయ్యారు.ఇక ఈ సినిమా ఈ మధ్య ఆస్కార్ నామినేషన్స్ లో స్థానం సంపాదించుకున్నప్పటి నుండి మరింత పాపులర్ అయ్యారు.
ఎట్టకేలకు తెలుగు ఖ్యాతిని గర్వించేలా చేయడంలో ఈ సినిమా దోహద పడింది.ఇక ఆస్కార్ తర్వాత గ్లోబల్ వైడ్ గా మరింత పాపులారిటీ తెచ్చుకున్నారు.
ఇక ఆస్కార్ తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఎక్కడికి వెళ్లిన ఏం చేసిన పెద్ద న్యూస్ అవుతుంది.అందుకే వీరి క్రేజ్ ను తమ సినిమా ప్రమోషన్స్ లో భాగం చేయడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు.
మరి మన టాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాల్లో ఏజెంట్ (Agent) ఒకటి. అఖిల్ (Akhil Akkineni) హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.
యాక్షన్ స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అఖిల్ మునుపెన్నడూ లేని విధంగా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు.ఇక ఈ సినిమాను సురేందర్ 2 సినిమాస్ తో కలిసి ఏకే ఎంటెర్టాన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఎంతో భారీ స్థాయిలో నిర్మిస్తుండగా.ఈయనకు జోడీగా సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే హిప్ హప్ తమిజా సంగీతాన్ని అందిస్తుండగా రసూల్ ఫొటోగ్రఫీ అందిస్తున్నారు.ఏప్రిల్ 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
మరి రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయడానికి అన్ని ప్లాన్స్ చేసుకుంటుంది.ఇందులో భాగంగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ లను ఆహ్వానించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.ఈ ఈవెంట్ ఏప్రిల్ మధ్యలో జరగనుందని ఈ స్టార్స్ ఇద్దరు అంగీకరిస్తే మెగా, అక్కినేని, నందమూరి ఫ్యాన్స్ కు కన్నుల పండుగగా ఉండడం ఖాయం అంటున్నారు.
చూడాలి ఏం జరగనుందో.