చంద్రబాబు పవన్ భేటీ పై రోజా సీరియస్ కామెంట్స్...!!

హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాసంలో పవన్ కళ్యాణ్ భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.ఏప్రిల్ నెలలో ఢిల్లీ టూర్ లో బీజేపీ పెద్దలతో భేటీ తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తిగా సినిమా షూటింగ్ లకు పరిమితమయ్యారు.

ఈ క్రమంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ కావటం సంచలనంగా మారింది.

ఈ రీతిగా ఈ ఇద్దరు మూడోసారి భేటీ కావడం జరిగింది.అయితే ఈ భేటీ పై రకరకాల వార్తలు విశ్లేషణలు వస్తున్నాయి.ఈ క్రమంలో వైసీపీ మంత్రి రోజా.

వీరిద్దరి భేటీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.పవన్ చంద్రబాబు భేటీ కొత్తేం కాదు.

మొదట్లో అయితే హాట్ టాపిక్.ఇప్పుడు కామన్.

జగన్ ను రాజకీయంగా తరిమేయాలన్న కుట్ర జరుగుతూనే ఉంది.బాబు, పవన్ పగటి కలలు కంటున్నారు.

వారిద్దరూ కలిసి వచ్చిన చర్చకు సిద్ధం.నగరి, కుప్పం లేదా పవన్ ఓడిపోయిన నియోజకవర్గలలో నైనా రెడీ.

మీరేం చేశారో, మేమేం చేశామో ప్రజలే చెబుతారు అని మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube