తెలంగాణ రాష్ట్రంలో కరోనా హైరానా పుట్టిస్తోంది.వైరస్ తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా మళ్లీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.
వేలల్లో కేసులు నమోదవుతునే ఉన్నాయి.ప్రభుత్వం రోజూ యాంటిజెన్ ర్యాపిడ్ టెస్టులు నిర్వహించి, కరోనా పాజిటివ్ వచ్చిన వారిని హోం క్వారంటైన్ కు తరలించి చికిత్స అందిస్తోంది.
కేసులు నమోదవుతున్న సంఖ్యతో పాటు కరోనా నుంచి క్యూర్ అవుతున్న వారి సంఖ్య కూడా అలానే ఉంది.మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది.
తెలంగాణ ఆరోగ్యశాఖ తాజాగా కరోనా హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది.మొన్న 900 కేసులకే పరిమితమైన కేసులు నిన్న మళ్లీ 1,682 కేసులు నమోదయ్యాయి.దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 99,937కి చేరింది.కాగా, నిన్న ఒకే రోజు 2,070 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
దీంతో కరోనా నుంచి క్యూర్ అయిన వారి సంఖ్య 72,202కి పెరిగింది.ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 21,024గా ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది.
కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 711 గా ఉంది.కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వం ప్రజలకు సూచనలు అందించింది.
అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, మాస్కులు, శానిటైజర్లు వాడాలని, సామాజిక దూరం పాటించాలన్నారు.పౌష్టికాహారాన్ని తీసుకుని ఇమ్యూనిటీని పెంచుకోవాలని అన్నారు.