కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వంలో, ఆయన హీరోగా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కాంతార.ఈ సినిమా మొదట కన్నడ భాషలో విడుదలయ్యి అనంతరం ఇతర భాషలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హోంభలే ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ కేవలం 16 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించగా ఈ సినిమా 400 కోట్ల కలెక్షన్లను రాబట్టడం విశేషం.ఇలా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల ఎంతో అద్భుతమైన ఆదరణ సంపాదించుకోవడంతో ఈ సినిమాకి సీక్వెల్ చిత్రం వస్తుందని అందరూ భావించారు.
ఇక ఈ విషయంపై నిర్మాత విజయ్ కిరంగదూర్ మాట్లాడుతూ ఇప్పటికే కాంతార2 కిసంబంధించిన స్క్రిప్ట్ పనులను రిషబ్ శెట్టి ప్రారంభించారని ఈ సినిమా షూటింగును జూన్ నెల నుంచి ప్రారంభిస్తామని ఈయన వెల్లడించారు.అయితే తాజాగా ఈ సినిమా గురించి నటుడు రిషబ్ శెట్టి మాట్లాడుతూ… కాంతార సినిమాకు సీక్వెల్ సినిమా కాదని.ఇది ఫ్రీక్వెల్ చిత్రమని తెలియజేశారు.తొలి భాగం ఎక్కడైతే ప్రారంభమైందో.దానికి ముందు జరిగిన సంఘటనలను రెండో భాగంలో చూపించనున్నట్టు పేర్కొన్నారు.పంజుర్లికి సంబంధించిన సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయని ఈ సందర్భంగా రిషబ్ వెల్లడించారు.
ఈ సినిమా ఫ్రీక్వెల్ చిత్రంలో ప్రీక్వెల్లో గ్రామస్తుల మధ్య అనుబంధాలు, గుళిగ దైవం, రాజు గురించి చూపించబోతున్నట్లు తెలియజేశారు.ఇక ఈ చిత్రాన్ని 2024వ సంవత్సరంలో విడుదల చేయబోతున్నట్లు రిషబ్ శెట్టి ఈ సందర్భంగా వెల్లడించారు.ఇక ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు వర్షం పడే సమయంలో చిత్రీకరించాల్సి ఉందని అందుకే ఈ చిత్రాన్ని జూన్ నెలలో షూటింగ్ పనులను ప్రారంభించబోతున్నట్లు గతంలో నిర్మాత వెల్లడించిన సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమాకి ఫ్రీక్వెల్ రాబోతుందని తెలియడంతో ఈ సినిమా గురించి కూడా అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.