అక్కడా ఇక్కడా అదే సీన్ ! అల్లర్లనే నమ్ముకున్న లోకేష్ ? 

అకస్మాత్తుగా ఎవరికైనా హైప్ రావాలి అంటే ఏదో ఒక సంచలనం చోటు చేసుకోవాల్సిందే ! ఇప్పుడు అంటువంటి సంచలనాల ద్వారానే తనకు , తన పార్టీకి మైలేజ్ తెచ్చుకోవాలి అన్నట్టు గా వ్యవహరిస్తున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.( Nara Lokesh ) ప్రస్తుతం యువ గళం పాదయాత్ర ద్వారా హైప్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్న లోకేష్ అధికార పార్టీ వైసీపీని( YCP ) టార్గెట్ చేసుకుని అనేక విమర్శలు చేస్తున్నారు.

 Riots In Nara Lokesh Yuvagalam Padayatra Punganuru Bhimavaram Details, Tdp, Chan-TeluguStop.com

ఎప్పటిలాగే లోకేష్ , జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారన్నట్లుగా ప్రజల్లోనూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో,  తన యువగళం పాదయాత్ర( Yuvagalam Padayatra ) జనాల దృష్టిని ఆకర్షించే విధంగా,  రాజకీయ వర్గాల్లో చర్చ జరిగే విధంగా లోకేష్ ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తున్నారు.అందుకే ఎక్కడికక్కడ పార్టీ శ్రేణులను ఉత్సాహపరుస్తూ, వైసిపి పై కవింపు చర్యలకు దిగుతున్నారు .ఈ సందర్భంగా అనేక అల్లర్లు , గొడవలు లోకేష్ సమక్షంలో జరుగుతున్నాయి.

Telugu Ap Cm Jagan, Bhimavaram, Challa Babu, Chandrababu, Cm Jagan Flexis, Punga

సొంత పార్టీ నేతలు ఈ వ్యవహారాలకు పాల్పడుతున్నా,  లోకేష్ అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.అలాగే పోలీసులపైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు ఆయనపై వస్తున్నాయి.కొద్దిరోజుల కిందట పుంగనూరు నియోజకవర్గంలో( Punganur ) పాదయాత్ర సందర్భంగా చోటు చేసుకున్న అల్లర్లు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

పుంగనూరు టౌన్ లోకి వెళ్లేందుకు ఎటువంటి అనుమతులు తీసుకోకుండా పోలీసులను బెదిరించి,  నగరంలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు.  ఈ సందర్భంగా ఏర్పడిన కొట్లాటలో కొంతమంది పోలీసులు తీవ్ర గాయాలపాలయ్యారు.

పుంగనూరులో తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి చల్లా బాబు( Challa Babu ) ఆధ్వర్యంలో ఈ హింస జరిగినట్లుగా అనేక సాక్షాలు బయటకు వచ్చాయి.

Telugu Ap Cm Jagan, Bhimavaram, Challa Babu, Chandrababu, Cm Jagan Flexis, Punga

ఇక అదే మాదిరిగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరం లోనూ( Bhimavaram ) అటువంటి సంఘటన చోటుచేసుకున్నాయి.లోకేష్ పాదయాత్ర లో అనేక అల్లర్లు జరిగాయి .కర్రలు,  బీర్ సీసాలతో వైసిపి నాయకులే లక్ష్యంగా దాడులు జరిగాయి.అలాగే ఏపీ సీఎం జగన్ ఫ్లెక్సీలు( CM Jagan ) చించుతూ సీసాలు విసురుతూ ఆందోళన సృష్టించారు.ఇక ఎవరిపై ఎన్ని ఎక్కువ కేసులు ఉంటే అంత పెద్ద పదవులు వారికి ఇస్తానంటూ లోకేష్ పదే పదే చెబుతుండడంతో దానిని స్ఫూర్తిగా చేసుకునే పుంగనూరు భీమవరంలో ఈ తరహా దాడులకు తెగబడ్డారని వైసిపి నాయకులు విమర్శిస్తున్నారు.

ఏది ఏమైనా పాదయాత్ర పేరుతో లోకేష్ పాదయాత్ర పైనే దృష్టి సాధించాల్సి ఉన్న,  అల్లర్లు,  ఆందోళన కార్యక్రమాలతో తన యాత్ర జనాల దృష్టిని ఆకర్షించే విధంగా లోకేష్ ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube