నేనే ఎన్టీఆర్ అసలైన కుమారుడుని! ఆర్జీవి ఆసక్తికర వ్యాఖ్యలు

గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన తెలుగు చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్.

వివాదాస్పద చిత్రాల దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈ సినిమాని ఎన్టీఆర్ నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించాడు.

ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత వచ్చిన ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ తో మరోసారి ఆర్జీవీ వివాదాలకు కేంద్రబిందువుగా మారాడు.ఈ సినిమా అనేక అవాంతరాల మధ్య తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అయితే ఏపీలో ఎన్నికల నేపథ్యంలో అక్కడ రిలీజ్ కాకుండా హైకోర్టు అడ్డుపడింది.ఈ సినిమాలో ఎక్కువ భాగం టిడిపి పార్టీ, చంద్రబాబు వ్యక్తిగతం మీద బురద చల్లే విధంగా ఉందని తెలుగుదేశం పార్టీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఎన్నికలు ముగిసేంతవరకు ఏపీలో సినిమా రిలీజ్ చేయకూడదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా రిలీజ్ సందర్భంగా చిత్ర దర్శకుడు రాంగోపాల్ వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఒక సినిమాని ఒక ప్రాంతంలో మాత్రమే రిలీజ్ చేయకుండా అడ్డుకోవడం ఇప్పటివరకు సినిమా చరిత్రలో జరగలేదని, నిజాలు ప్రజలకు తెలుస్తాయని తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ సినిమాని అడ్డుకున్నారని అన్నారు.తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా చూసిన తర్వాత నందమూరి అభిమాని నిజమైన ఎన్టీఆర్ కుమారుని నేనే అంటూ పెట్టిన కామెంట్ తన లైఫ్ లో గొప్ప ప్రశంసగా భావిస్తానని ఆర్జీవి చెప్పుకొచ్చాడు.

Advertisement

ఇక ఏపీలో రిలీజ్ విషయంపై తాను నిర్మాత డిస్ట్రిబ్యూటర్ కలిపి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఈ సందర్భంగా వర్మ తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు