ఢిల్లీ పాలన అధికారంపై సుప్రీంకోర్టులో కేంద్రం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది.ఇటీవల ధర్మాసనం ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ పిటిషన్ వేసింది.
పాలనాధికారం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికే ఉంటుందని గతంలో సుప్రీం కోర్టు తీర్పును వెలువరించింది.అయితే ఎన్నో ఏళ్లుగా ఢిల్లీ ప్రభుత్వానికి మరియు రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ కు మధ్య జరుగుతున్న వివాదానికి సుప్రీంతీర్పుతో తెర పడింది.
శాంతి భద్రతలు మినహా అన్ని వ్యవహారాలపై ప్రభుత్వానికే నియంత్రణ ఉంటుందని తేల్చి చెప్పింది.