గుజరాత్ అసెంబ్లీ కీలక తీర్మానం చేసింది.2002లో జరిగిన అల్లర్లపై మోదీ హస్తం ఉందంటూ బీబీసీ డాక్యుమెంటరీ రూపొందించిన విషయం తెలిసిందే.ఈ వీడియోపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే ప్రసారాన్ని నిలిపివేయడంతో పాటు ట్విట్టర్, యూట్యూబ్ లింక్ లను షేర్ చేయరాదంటూ ఆదేశాలు జారీ చేసింది.
తాజాగా ఈ వీడియోపై గుజరాత్ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది.బీబీసీపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానాన్ని పంపింది.కాగా ఈ డాక్యుమెంటరీ దేశ ప్రజలందరికీ వ్యతిరేకమని గుజరాత్ హోంమంత్రి హర్ష సాంఘ్వీ తెలిపారు.