బీబీసీపై చర్యలకు గుజరాత్ అసెంబ్లీలో తీర్మానం..!

గుజరాత్ అసెంబ్లీ కీలక తీర్మానం చేసింది.2002లో జరిగిన అల్లర్లపై మోదీ హస్తం ఉందంటూ బీబీసీ డాక్యుమెంటరీ రూపొందించిన విషయం తెలిసిందే.

ఈ వీడియోపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే ప్రసారాన్ని నిలిపివేయడంతో పాటు ట్విట్టర్, యూట్యూబ్ లింక్ లను షేర్ చేయరాదంటూ ఆదేశాలు జారీ చేసింది.

తాజాగా ఈ వీడియోపై గుజరాత్ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది.బీబీసీపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానాన్ని పంపింది.

కాగా ఈ డాక్యుమెంటరీ దేశ ప్రజలందరికీ వ్యతిరేకమని గుజరాత్ హోంమంత్రి హర్ష సాంఘ్వీ తెలిపారు.

స్టార్ హీరో ప్రభాస్ అలా చేయడంతో గూస్ బంప్స్ వచ్చాయి.. ఫైట్ మాస్టర్ కామెంట్స్ వైరల్!