హీరోయిన్ రీమాసేన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా ?

హీరోయిన్ రీమా సేన్.ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఎందుకంటే ఈవిడ పేరు తెలియని వారు ఉండరు.

ఎన్నో సినిమాల్లో నటించిన రీమా సేన్ ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగింది.అంతటి స్టార్ హీరోయిన్ రమ్య కృష్ణ తర్వాత హీరోయిన్ రోల్ తో పాటు విలన్ రోల్ లో కూడా ఎంతో అద్భుతంగా నటించి మంచి పేరు సంపాదించిన హీరోయిన్ రీమా సేన్.

ఆమెకు 15 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచే చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించడం మొదలు పెట్టింది.బెంగాలీ సినిమాల్లో నటించిన ఆమె 2000 లో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

తీసిన మొదటి చిత్రమే సూపర్ హిట్ అయ్యింది.అదే చిత్రం.

Advertisement

ఉదయ్ కిరణ్ హీరోగా వచ్చిన ఈ చిత్రాన్ని తేజ దర్శకత్వం వహించారు.ఈ సినిమా ఇప్పటికి సూపర్ హిట్ అన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే.

ఆ సినిమాలో నటించిన రీమా సేన్ ఆ ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ ఇమేజ్ సొంతం చేసుకుంది.కలర్ తక్కువ ఉన్న అద్భుతమైన నటనతో అందరిని ఆకట్టుకుంది.

ఇక ఆతర్వాత మనసంతా నువ్వే సినిమాలో నటించిన ఆమె శింబుతో కలిసి వల్లభ సినిమాలో నటించింది.వల్లభలో విలన్ పాత్రలో నటించి ఎన్నో ప్రశంసలు పొందిన రీమా సేన్ టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించింది.2012 వరకు సినిమాల్లో ఉన్న ఆమె 2012 లో పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది.ఇక ఆతర్వాత ఏ సినిమాల్లోనూ కనిపించలేదు ఈ బ్యూటీ.

అయితే పెళ్లి అయ్యి పిల్లలు ఉన్న కూడా అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది రీమా సేన్.త్వరలోనే సినిమాల్లోకి వస్తుందని ఇండస్ట్రీలో కూడా గుస గుసలు వినిపిస్తున్నాయ్.మరి ఏ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుందో చూడాలి.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు