బాలయ్య మూవీ వల్ల మల్టీస్టారర్స్ కు గుడ్ బై చెప్పిన శోభన్ బాబు.. ఏమైందంటే?

ఆంధ్రుల అందాల నటుడిగా శోభన్ బాబు పాపులారిటీని సంపాదించుకున్న సంగతి తెలిసిందే.శోభన్ బాబు సినీ కెరీర్ లో ఎన్నో విజయాలు ఉన్నాయి.

కుటుంబ కథా చిత్రాలలో నటించి శోభన్ బాబు పాపులారిటీని పెంచుకున్నారు.నాటకాల ద్వారా కెరీర్ ను మొదలుపెట్టిన శోభన్ బాబు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తక్కువ సమయంలోనే నటుడిగా ఎదిగారు.

దైవబలం, భక్త శబరి సినిమాల్లో శోభన్ బాబు చిన్నచిన్న పాత్రలు చేశారు.ఆ తర్వాత హీరోగా మారిన శోభన్ బాబు ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్నారు.

శోభన్ బాబు తన సినీ కెరీర్ లో ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్నారు.ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాలు ఎక్కువగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

Advertisement

మల్టీస్టారర్ సినిమాలు హిట్టైతే ఏ సమస్య లేకపోయినా ఫ్లాపైతే మాత్రం ఇద్దరు హీరోల ఫ్యాన్స్ హర్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.సోలో హీరోగా సినిమా ఆఫర్లు తగ్గిన తర్వాత శోభన్ బాబు బాలకృష్ణతో కలిసి అశ్వమేథం సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మాతగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా రాఘవేంద్రరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.మీనా, నగ్మా ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించగా ఈ సినిమాకు రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

అయితే సినిమా రిలీజ్ తర్వాత ఈ మూవీకి ఫ్లాప్ టాక్ వచ్చింది.సినిమాలో శోభన్ బాబు పాత్రను చంపేయడంతో ఆయన ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు.నిర్మాత అశ్వనీదత్ కు ఈ సినిమా వల్ల భారీ మొత్తంలో నష్టాలు వచ్చాయి.

ఈ సినిమా రిజల్ట్ వల్ల శోభన్ బాబు మల్టీస్టారర్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు