మంచు విష్ణు మంచు మనోజ్ మధ్య గొడవలకు కారణాలేంటో ఎవరికీ అర్థం కావడం లేదు.మంచు విష్ణు తమ మధ్య గొడవలేం లేవనే విధంగా స్పందించగా మనోజ్ మాత్రం ఒకింత ఘాటుగా స్పందించారు.
విష్ణును పరోక్షంగా ఉద్దేశిస్తూ మనోజ్ ఘాటు పోస్ట్ లు చేశారు.క్రియేటివిటీకి నెగిటివిటీయే శత్రువు అని మనోజ్ ఒక పోస్ట్ లో పేర్కొన్నారు.
మీరు బ్రతకండి ఇతరులను కూడా బ్రతకనివ్వండి అంటూ మనోజ్ మరో పోస్ట్ లో చెప్పుకొచ్చారు.
కళ్ల ముందు తప్పులు జరుగుతుంటే చూసీచూడనట్టు వదిలేయడానికి బదులుగా నిజం కొరకు పోరాడి చావడానికైనా సిద్ధమే అంటూ మనోజ్ షేర్ చేసిన కొటేషన్ హాట్ టాపిక్ అవుతోంది.
మరోవైపు నిన్న మంచు విష్ణు మంచు మనోజ్ మధ్య గొడవ జరగగా మంచు లక్ష్మి( Lakshmi Manchu ) మాత్రం నిన్న పార్టీ ఇవ్వడం గమనార్హం.ఈ పార్టీ మనోజ్ రెండో పెళ్లికి సంబంధించిన పార్టీ ఇచ్చారు.
మనోజ్ పెళ్లి సందర్భంగా స్నేహితులను పిలిచి మంచు లక్ష్మి పార్టీ ఇవ్వడం గమనార్హం.మంచు లక్ష్మి కూల్ గా ఉండటం గమనార్హం.మోహన్ బాబు భార్య, మంచు లక్ష్మి ఈ గొడవ పెద్ద గొడవ కాదని చెబుతున్న సంగతి తెలిసిందే.మంచు మనోజ్, విష్ణు తమ మధ్య గొడవలను పరిష్కరించుకుంటే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
మనోజ్ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.
విష్ణు మాత్రం ఈ మధ్య కాలంలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించలేదనే సంగతి తెలిసిందే.విష్ణు, మనోజ్ కలిసి సినిమాలు చేస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.
మనోజ్, విష్ణులకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.వీళ్లిద్దరి సక్సెస్ రేట్ పెరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.