కోహినూర్ వజ్రం ఒస్తోంది ?

బ్రిటీష్ పాలనలో ఇండియా నుంచి తరలివెళ్లిపోయిన అత్యంత విలువైన కోహినూర్ వజ్రాన్ని తిరిగి ఇండియాకు ఎలా తెప్పించాలన్న విషయమై నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు పార్లమెంటులో చర్చించనుంది.

కోహినూర్ విషయంలో కోర్టులో ఓ మాట చెప్పి, ఆపై 24 గంటలు తిరక్కముందే మరో మాట చెప్పి, విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కేంద్రం, నష్ట నివారణ దిశగా, ఈ అంశాన్ని పార్లమెంట్ ముందే ఉంచాలని నిర్ణయించింది.

ఈ వజ్రాన్ని బ్రిటన్ బలవంతంగా తీసుకెళ్లలేదని, వారికి బహుమతిగా పంజాబ్ పాలకులు ఇచ్చారని, అందువల్ల తిరిగి ఇవ్వాలని కోరలేమని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలుపగా, దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి.ఆపై, సామరస్య పూర్వకంగా వజ్రాన్ని తిరిగి ఇండియాకు తీసుకురావాలన్నదే తమ అభిమతమని కేంద్ర సాంస్కృతిక శాఖ ఓ ప్రకటనలో తెలిపిన సంగతి విదితమే.

వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

తాజా వార్తలు