ఆర్.ఆర్.ఆర్ తర్వాత తన దూకుడు పెంచాడు రాం చరణ్.ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్న చరణ్ ఆ సినిమా తర్వాత బుచ్చి బాబు డైరెక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాను 2023 సెకండ్ హాఫ్ లో మొదలు పెడతాడని తెలుస్తుంది.అయితే ఆర్సీ 15 షూటింగ్ పూర్తి చేయడం ఆలస్యం కొద్దిపాటి గ్యాప్ తోనే చరణ్ 16వ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నారట.
రాం చరణ్ కూడా అందుకు ఓకే అన్నట్టు టాక్.
ఉప్పెనతో మొదటి సినిమానే సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ బుచ్చి బాబు ఈసారి తన సెకండ్ సినిమాని మరో రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారట.
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో చరణ్ లుక్స్, స్టైల్ డిఫరెంట్ గా ఉంటాయని తెలుస్తుంది.ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా 250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తారని తెలుస్తుంది.ఈ సినిమాకు చరణ్ 100 కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకుంటున్నట్టు తెలుస్తుంది.
ఈ సినిమా తప్పకుండా మెగా ఫ్యాన్స్ నే కాదు సగటు సినీ ప్రేక్షకుడిని కూడా మెప్పించేలా ప్లాన్ చేస్తున్నారు బుచ్చి బాబు.
.