అవును, బ్యాంక్ కస్టమర్లకు ఆర్బీఐ( RBI ) చల్లని కబురు అందించింది.కస్టమర్ల కోసం కొత్త సర్వీసులు తీసుకువస్తున్నట్లు తాజాగా ప్రకటించింది.
ఈ క్రమంలో అన్ని బ్యాంకుల కస్టమర్ల కోసం ఒక వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకురానుంది.దీంతో బ్యాంక్ ఖాతాదారులకు ఎంతోకొంత ఊరట చేకూరనుంది.
పదేళ్లు దాటినా కూడా అకౌంట్ల నుంచి డబ్బులు విత్డ్రా చేయకుండా వున్న అన్క్లెయిమ్ డిపాజిట్ల వివరాలను సులభంగా ఈ కొత్త వెబ్ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చని ఆర్బీఐ తాజాగా వివరించింది.

అవును, ప్రస్తుతం బ్యాంక్ కస్టమర్లు సంబంధిత బ్యాంక్ వెబ్సైట్కు వెళ్లి అన్క్లెయిమ్ డిపాజిట్ల( Unclaimed deposits ) గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది.అయితే కొత్తగా తీసుకువచ్చే వెబ్సైట్లోకి అన్ని బ్యాంకుల అన్క్లెయిమ్ డిపాజిట్ల వివరాలు ఒకే చోటు మనకి కనబడడం గమనార్హం.బ్యాంక్ కస్టమర్లకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఆర్బీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తాజా ప్రకటనలో వెల్లడించింది.
బ్యాంక్లో పదేళ్లు మించి ఉన్న డిపాజిట్లను ఆర్బీఐకు ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది.అంటే పదేళ్లకు దాటినా కూడా ఎవ్వరూ ఆ డబ్బులను విత్డ్రా చేసుకోకపోతే.ఆ డబ్బులు ఆర్బీఐకు చేరుతాయన్నమాట.

ఆ తరువాత అవి డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్లో( Depositor Education and Awareness Fund ) జమ అవుతాయి.ఫిక్స్డ్ డిపాజిట్లు మెచ్యూరిటీ అయిపోయినా విత్డ్రా చేసుకోకపోవడం, బ్యాంక్ ఖాతాదారులు మరణించినప్పుడు నామినీ ఆ అకౌంట్లలోని డబ్బులను తీసుకోకపోవడం వంటి పలు అంశాల నేపథ్యంలో ఈ అన్క్లెయిమ్ డిపాజిట్లు అనేవి ఏర్పడుతూ ఉంటాయి.ఆర్బీఐ ప్రకారం చూస్తే.ఫిబ్రవరి 2023 చివరి నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆర్బీఐకి అన్క్లెయిమ్ డిపాజిట్ల రూపంలో రూ.35,012 కోట్లను బదిలీ చేశాయి.అంటే ఏ స్థాయిలో డబ్బులు బ్యాంకుల్లో మిగిలిపోయాయో అర్థం చేసుకోవచ్చు.ఎస్బీఐలో అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు రూ.8086 కోట్లుగా ఉన్నాయి.పంజాబ్ నేషనల్ బ్యాంక్లో రూ.5340 కోట్లు, కెనరా బ్యాంక్లో రూ.4558 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.3904 కోట్లు అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు ఉన్నాయి.