కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీకి పరిచయమై ప్రస్తుతం ఇండస్ట్రీలో అగ్రతారక ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రష్మిక మందన్న గురించి పరిచయం అవసరం లేదు.ప్రస్తుతం ఈమె పాన్ ఇండియా స్థాయిలో సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఇలా అగ్ర హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రష్మిక తరచు ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.ఇప్పటికే ఈమె ఎన్నో వివాదాలను ఎదుర్కోవడంతో ఆ వార్తలన్నింటికీ ఫులి స్టాప్ పెట్టారు.
తాజాగా మరోసారి సినిమా విషయంలో ఈమె స్పందించిన తీరు పట్ల మండిపడిన కన్నడ ప్రేక్షకులు తనని కన్నడ చిత్ర పరిశ్రమ బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేశారు.ఇలా కన్నడ చిత్ర పరిశ్రమ రష్మిక మందన్నను బ్యాన్ చేసిందంటూ పెద్ద ఎత్తున తన గురించి వార్తలు వచ్చాయి.
అయితే తాజాగా ఈ వార్తలపై స్పందించిన రష్మిక అసలు విషయం తెలియజేస్తూ ఈ వార్తలకు చెక్ పెట్టారు.ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ తనని కన్నడ చిత్ర పరిశ్రమ బ్యాన్ చేయలేదని తెలియజేశారు.

కన్నడ చిత్ర పరిశ్రమ పట్ల నాకు ఎంతో గౌరవం అంకితభావం ఉందని అయితే తనని ఇండస్ట్రీ బ్యాన్ చేసిందని వస్తున్నటువంటి వార్తలలో ఏమాత్రం నిజం లేదని ఆ వార్తలు పూర్తిగా ఆవాస్తవమని కొట్టి పారేశారు.ఇకపోతే కాంతర సినిమా వివాదం గురించి కూడా మాట్లాడుతూ మీడియా వాళ్ళు నన్ను ఈ ప్రశ్న అడిగినప్పటికీ నేను నిజంగానే ఈ సినిమా చూడలేదు అందుకే చూడలేదని చెప్పాను.సినిమా చూసిన తర్వాత సినిమా చాలా అద్భుతంగా ఉంది అంటూ చిత్ర బృందానికి కంగ్రాట్స్ అని మెసేజ్ కూడా పెట్టానని వాళ్లు కూడా థాంక్యూ అంటూ రిప్లై ఇచ్చారని తెలిపారు.నా సినిమాల పట్ల నేను బాధ్యతగా వ్యవహరిస్తాను కానీ నా పర్సనల్ విషయాలు కూడా కెమెరాలు పెట్టి చూపించాలంటే వీలుపడదు అంటూ ఈ సందర్భంగా రష్మిక తన గురించి వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు.