గ్లామర్ బ్యూటీ రష్మిక మందన్న ను నేషనల్ క్రష్ గా అభిమానులు ఎంతో అభిమానంగా పిలుచు కుంటారు.ఈమె నిన్న మొన్నటి వరకు సౌత్ హీరోయిన్ గా మాత్రమే అందరికి తెలుసు.
అయితే పుష్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత నుండి రష్మిక మెల్లమెల్లగా అంతటా గుర్తింపు తెచ్చుకుంది.ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా ఆఫర్స్ అందుకుని పాన్ ఇండియా హీరోయిన్ గా మారి పోయింది.
ఇప్పుడు ఈమె అన్ని ఇండస్ట్రీలలో వరుస సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది.ప్రెసెంట్ రష్మిక చేతిలో మిషన్ మజ్ను, గుడ్ బై, తో పాటు తెలుగులో పుష్ప 2, వంశీ పైడిపల్లి, విజయ్ సినిమా ఉన్నాయి.
అలాగే దుల్కర్ సల్మాన్ సీతా రామం లో అతిథి పాత్రలో మెరుస్తుంది.అయితే ఈమెకు ఇంతటి పేరు రావడానికి ఒకరకంగా విజయ్ గీత గోవిందం సినిమానే కారణం.
ఈమె ముందు చేసింది ఛలో సినిమా అయినా.గీత గోవిందం మాత్రం బాగా కలిసి వచ్చింది.
ఇందులో విజయ్ దేవరకొండకు పెయిర్ గా నటించి సూపర్ హిట్ జోడీ అనిపించుకుంది.ఇక అప్పటి నుండి వీరు మంచి స్నేహితులు అయ్యారు.
ఈమెతో విజయ్ డియర్ కామ్రేడ్ సినిమా కూడా చేసాడు.ఇలా వీరి పెయిర్ హిట్ అవ్వడంతో వీరిద్దరూ లవర్స్ అని పెళ్లి చేసుకుంటున్నారు అంటూ వార్తలు వచ్చాయి.
కానీ ఈ వార్తలను ఇద్దరు తోసిపుచ్చి మంచి స్నేహితులు అని చెప్పుకొచ్చారు.ఇక తాజాగా వీరి గురించిన మరొక వార్త నెట్టింట వైరల్ అయ్యింది.రష్మిక తన స్నేహితుడి కోసం ఐటెం సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటూ వార్తలు వస్తున్నాయి.ప్రెసెంట్ విజయ్ లైగర్ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంచి.
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలోనే జనగణమణ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాలో రౌడీ స్టార్ కోసం రష్మిక ఐటెం సాంగ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.మరి ఈమె కనుక స్పెషల్ సాంగ్ లో చిందేస్తే ఈ సాంగ్ సినిమాకే హైలెట్ గా నిలిచే అవకాశం ఉంది.చూడాలి ఈమె నిజంగానే ఒప్పుకుందా లేదంటే రూమర్ మాత్రమేనా అనేది.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుంది.