గుజరాత్ అహ్మదాబాద్ లో నరేంద్ర మోడీ( Narendra Modi ) స్టేడియంలో ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది.బీసీసీఐ( BCCI ) ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించింది.
అయితే ఈ కార్యక్రమంలో హీరోయిన్ రష్మిక మందన లైవ్ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వటం జరిగింది.ఐపీఎల్ వేడుకలలో తెలుగు పాటలు మారు మ్రోగాయి.దీనిలో భాగంగా ఆస్కార్ అవార్డు అందుకున్న “RRR”.“నాటు నాటు” సాంగ్ కు హీరోయిన్ రష్మిక మందన మాస్ స్టెప్పులతో వేదికని దద్దరిలేటట్టు చేసింది.
“నాటు నాటు” సాంగ్ ప్రపంచవ్యాప్తంగా భారీ హిట్ కావడంతో… రష్మిక డాన్స్ వేస్తున్నప్పుడు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇదే సమయంలో “పుష్ప” సినిమాలోని “ఊ అంటావా మావా”, “సామీ సామీ”, శ్రీవల్లి పాటలకు రష్మిక మందన ఇంకా తమన్నా ఇద్దరు కూడా అదిరిపోయే స్టెప్ లతో ఐపీఎల్ వేదికపై చెలరేగిపోయారు.ఈ ఇద్దరు హీరోయిన్లు చేస్తున్నా డాన్స్ మరియు పాటలకు ఆడియన్స్ నుండి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.