మొదటిసారిగా ప్రేమ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిన రష్మీ... ఆ బాధ నాకు తెలుసు?

జబర్దస్త్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో యాంకర్ రష్మీ ఒకరు.ఈమె బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలలో కేవలం జబర్దస్త్ కార్యక్రమానికి మాత్రమే యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో మంచి గుర్తింపు పొందారు.

 Rashmi Emotional Talking About Love For The First Time,rashmi, Tollywood, Emotio-TeluguStop.com

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సుడిగాలి సుధీర్ తో కలిసి రష్మీ చేసే రచ్చ మామూలుగా ఉండదు.ఈ క్రమంలోనే వీరిద్దరి జోడి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోవడమే కాకుండా,వీరి మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి చాలా మంది వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ పెద్దఎత్తున వార్తలు సృష్టించారు.

ఇలాంటి వార్తలు రావడంతో ఇదే అదునుగా భావించి పలు స్పెషల్ ఈవెంట్ లలో ఈ జంటకు పెళ్లి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.తాజాగా వచ్చేవారం ప్రసారం కాబోయే ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

ఈ ప్రోమోలో భాగంగా రష్మీ ఆటో రాంప్రసాద్ చెల్లెలిగా నటించారు.తన చెల్లికి పెళ్ళి చేయాలని అన్ని ఏర్పాట్లు చేయగా ఆ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని రష్మీ నిద్రమాత్రలు మింగి చనిపోవాలని భావిస్తున్నట్లు చెబుతుంది.

Telugu Love, Rashmi, Tollywood-Movie

ఈ క్రమంలోనే ప్రేమ గురించి రష్మీ ఎమోషనల్ కామెంట్స్ చేస్తూ కంటతడి పెట్టుకున్నారు.ఈ సందర్భంగా రష్మీ మాట్లాడుతూ మనం మనస్ఫూర్తిగా ఒకరికి మనసులో చోటిస్తే మన గుండె చప్పుడు ఆగిపోయే వరకు ఈ మనసులో స్థానం వారికే.మనకు ఇష్టమైన వాళ్ళు మన పక్కన లేకపోతే ఎలా ఉంటుందో ఆ బాధ నాకు తెలుసు అంటూ ఈమె ఎమోషనల్ అయ్యారు.అయితే రష్మీ నిజంగానే తన మనసులో ఉన్న మాటను బయట పెడుతూ ఎమోషనల్ అయిందా లేకపోతే ప్రోమో కోసమే ఇలా చేశారా అనే విషయం తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube