బాలీవుడ్ లో గతంలో హీరో షారుక్ ఖాన్, హీరోయిన్ రాణి ముఖర్జీ కలిసి ఎన్నో సినిమాలలో నటించారు.వీరిద్దరు జంటగా నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచాయి.
దీనితో ప్రేక్షకులలో ఈ జోడికి మంచి క్రేజ్ ఏర్పడింది.అంతేకాకుండా ఈ జోడి వరుసగా పలు సినిమాల్లో కలిసి నటించడంతో, ప్రేక్షకులు కూడా ఈ జోడి కలిసి మరికొన్ని సినిమాలు నటించాలని కోరారు.
హీరోయిన్ గా రాణీముఖర్జీ కెరీర్ ముగిసిన తరువాత ఈమె బాలీవుడ్ ఫిలిం మేకర్ ఆదిత్య చోప్రాను పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయింది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాణీ ముఖర్జీ, ఆదిత్య చోప్రా, షారుక్ ఖాన్ కాంబినేషన్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.
భర్త ఆదిత్య దర్శకత్వంలో షారుక్ ఖాన్ తో మరొకసారి రొమాన్స్ చేసేందుకు సిద్ధమా? అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చింది.ఆదిత్య నేను భార్యాభర్తలమే కానీ సినిమా టైంలో ఒకరితో ఒకరు నిపుణులు గానే వ్యవహరిస్తాం.
ఈ క్రమంలో భార్యాభర్తలను అనే విషయాన్ని ఆదిత్య కూడా పట్టించుకోడు.అలాగే తను ఎప్పుడైనా కూడా స్క్రిప్ట్ ను నమ్మి సినిమాలు తీస్తాడు కాబట్టి మరోసారి అలాంటి మంచి కథ రాస్తే అందులో షారుఖ్ ఖాన్ రాణీ ప్రధాన పాత్రగా ఉండాలనుకుంటే ఖచ్చితంగా సినిమా చేస్తాను అంటూ వివరణ ఇచ్చింది.ఇప్పటి వరకు షారుక్ ఖాన్, రాణి ముఖర్జీ కలిసి ఐదు చిత్రాల్లో నటించగా, అవన్నీ కూడా బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.అంతే కాకుండా ఈ సినిమాలన్నీ కూడా యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో తెరకెక్కడం విశేషం.