అడుసు తొక్కనేల కాలు కడగనేల.. క్షమాపణలు చెప్పి లాభమేంటి రానా?

తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఎలాంటి సినిమాలను ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

మరీ బోల్డ్ గా ఉన్న సినిమాలు తెలుగులో హిట్ అయిన సందర్భాలు అరుదనే సంగతి తెలిసిందే.

అయితే రానా నాయుడు(Rana Naidu) వెబ్ సిరీస్ విషయంలో నెగిటివ్ కామెంట్లు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.అటు వెంకటేశ్ ను ఇటు రానాను సోషల్ మీడియా వేదికగా దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.

అయితే ఈ ట్రోల్స్ తన దృష్టికి రావడంతో రానా క్షమాపణలు చెప్పడం గమనార్హం.అయితే అడుసు తొక్కనేల కాలు కడగనేల అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇలాంటి వెబ్ సిరీస్ ల వల్ల దగ్గుబాటి ఫ్యామిలీ పరువు పోతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.రానా నాయుడు వెబ్ సిరీస్(Web series) కు క్రిటిక్స్ నుంచి సైతం నెగిటివ్ రివ్యూలు వచ్చాయి.

Advertisement

ఫస్ట్ సీజన్ కే ఇలాంటి రెస్పాన్స్ వస్తే సెకండ్ సీజన్,థర్డ్ సీజన్ సంగతి ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు.

రాబోయే రోజుల్లో అయినా ఈ తరహా వెబ్ సిరీస్ లకు దూరంగా ఉంటే బెటర్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.వెంకటేశ్ సైతం నెగిటివ్ కామెంట్ల గురించి స్పందిస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.వెంకటేశ్(Venkatesh) కథల ఎంపికలో జాగ్రత్త పడాలని వయస్సుకు తగిన కథలు ఎంచుకోవాలని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

దగ్గుబాటి హీరోల నుంచి మనం తరహా సినిమాను ఆశిస్తున్నామని ఫ్యాన్స్ చెబుతున్నారు.

ఈ వెబ్ సిరీస్ కు వెంకటేశ్ 12 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకోగా రానా 8 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారు.వెంకటేశ్ ప్రస్తుతం సైంధవ్ సినిమాలో నటిస్తున్నారు.మరోవైపు హీరో రానా నటిస్తున్న కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది.

స్కిన్ వైటెనింగ్ కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆయిల్ మీకోస‌మే!
Advertisement

తాజా వార్తలు