కాఫీ విత్ కరణ్ షోకు వెళ్లాలంటే లోగుట్టును అంతా బయట పెట్టే దమ్ము ఉండాలి.ఎందుకంటే ఈ షోలో భాగంగా కరణ్ జోహార్ వ్యక్తిగత విషయాల గురించి గుచ్చిగుచ్చి అడుగుతాడు.
ఇకపోతే ఎఫెయిర్ల విషయం అయితే వాటిని అసలు వదిలి పెట్టడు.తాజాగా ఈ షోకు ‘బాహుబలి’ టీం ప్రభాస్, రానా, రాజమౌళిలు హాజరయ్యారు.
ఈ షోలో భాగంగా రానా త్రిషతో తనకు గ రిలేషన్ షిప్ను బయట పెట్టాడు.ఇదివరకు ఎప్పుడు అడిగినా కూడా ఇద్దరు కేవలం మేము స్నేహితులమే అనే సమాధానాలు ఇస్తూ దాటేసేవారు.

తాజాగా రానా అలా కాకుండా త్రిషతో ఓ రెండు నెలలు డేటింగ్ చేశానని, ఆ తర్వాత మా రిలేషన్ ముందుకు వెళ్లలేదని క్లారటీ ఇచ్చేశాడు.రానా ఇలా చెప్పాడు ఒకే గాని ప్రస్తుతం ఈ హీట్ ముద్దుగుమ్మ త్రిషకు తగిలింది.రెండు నెలలు డేటింగ్ చేసి ఎలా రిజక్ట్ చేశారు, అసలు ఏమయింది, ఇద్దరి మద్య రిలేషన్షిప్ ఎంతవరకు వచ్చింది అని త్రిషకు స్నేహితులు, మీడియా, అభిమానులు ఒకటే కాల్స్ చేస్తున్నారట.

ఇన్ని రోజులు ఈ విషయం గురించి ఎందుకు బయటపెట్టలేదు అంటూ సన్నిహితులు ఫోన్లు చేస్తు త్రిషను ఆడుకుంటున్నారట.దాంతో ఇక చేసేది లేక త్రిష ఫోన్ స్విచ్చాఫ్ చేసి పక్కన పడేసినట్టు సమాచారం అందుతోంది.ఏది ఏమైనా వారి రిలేషన్ షిప్ గురించి రానా స్విచ్ వేస్తే ఆ హీట్ త్రిషకు తగుతోంది పాపం.
కానీ ఇద్దరి మద్య బ్రేకప్ ఎందుకయ్యిందో తెలుసుకోవాలని అందరికి ఆసక్తిగా ఉంటుంది.అందుకే ఈ అమ్మడికి వరుసపెట్టి కాల్స్ చేస్తున్నారు.







