టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం అందించిన సక్సెస్తో సెలెక్టివ్గా సినిమాలు చేస్తూనే దూకుడును ప్రదర్శిస్తున్నాడు ఈ యంగ్ హీరో.
ఇక రామ్ ప్రస్తుతం తమిళ దర్శకుడు లింగుసామి డైరెక్షన్లో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది.
కాగా ఈ సినిమా కోసం రామ్ మరోసారి మేకోవర్ కానున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి.
అయితే ఈ సినిమా కోసం రామ్ తన రెమ్యునరేషన్ను భారీగా పెంచేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.గతంలో రామ్ ఒక్కో సినిమాకు రూ.10 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకునేవాడు.అయితే లింగుసామితో తెరకెక్కబోయే సినిమా కోసం రామ్ తన రెమ్యునరేషన్ను అమాంతం రూ.3 కోట్లు పెంచేసినట్లు తెలుస్తోంది.దీంతో ఈ సినిమా కోసం ఆయన ఏకంగా రూ.13 కోట్ల రెమ్యునరేషన్ పుచ్చుకోనున్నాడట.రామ్ ఒక్కసారిగా ఇలా రెమ్యునరేషన్ పెంచడంతో సినీ వర్గాలు ఆశ్చర్యానికి గురవుతున్నాయట.కాగా ఈ సినిమాను లింగుస్వామి పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది.
ఇక ఈ సినిమాలో రామ్ స్టైలిష్ లుక్తో కనిపిస్తాడని, ఆయన పర్ఫార్మెన్స్ మరోసారి ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.కాగా ఈ సినిమాలో రామ్ సరసన అందాల భామ కృతి శెట్టి హీరోయిన్గా ఎంపికైనట్లు చిత్ర యూనిట్ అంటోంది.
ఈ జోడీ ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా వీరి మధ్య కెమిస్ట్రీ ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది.మరి రెమ్యునరేషన్ పెంచేసిన రామ్ ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో నటిస్తాడా, ప్రేక్షకులను ఎంతమేర మెప్పిస్తాడో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే అంటున్నారు సినీ ఎక్స్పర్ట్స్.