గ్లోబల్ వైడ్ గా పేరు ప్రఖ్యాతలు పొందిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ( Ram Charan Tej )ఇప్పుడు ఎవరికీ అందకుండా విభిన్నంగా ముందుకు వెళ్తున్నాడు.ఒకవైపు భారీ ప్రాజెక్టులు ప్రకటిస్తూనే మరో వైపు నిర్మాతగా మారి అడుగులు వేస్తున్నారు.
ప్రస్తుతం రామ్ చరణ్ అగ్ర డైరెక్టర్ శంకర్( Shankar ) దర్శకత్వంలో చేస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”గేమ్ ఛేంజర్”.
ఇక ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్( Sri Venkateswara Creations Banner ) పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.థమన్ సంగీతం అందిస్తుండగా అంజలి, సునీల్, శ్రీకాంత్ వంటి వారు కీలక రోల్స్ లో నటిస్తున్నారు.
ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తన 16వ సినిమాను కూడా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.
ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ తో చేయనున్నట్టు ప్రకటించగా.ఈ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయింది.అయితే ఇప్పుడు చరణ్ వారితోనే కొలాబరేట్ అయ్యి ”వి మెగా పిక్చర్స్” ( V Mega Pictures )అనే సరిక్తోహ బ్యానర్ ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు చరణ్ ఒక సినిమాను ఈ బ్యానర్ లోనే చేయనున్నాడు అని టాక్ వినిపిస్తుంది.మరి ఈ రూమర్స్ నిజమవుతాయా లేదా అలాగే రూమర్స్ గానే ఉండిపోతాయో చూడాలి.
”వి మెగా పిక్చర్స్” సంస్థలో ఇప్పటికే మొదటి సినిమాను అనౌన్స్ చేసిన సంగతి విదితమే.యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా వీరి ఫస్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసారు.ఈ సినిమాను నూతన డైరెక్టర్ రామ్ వంశీ కృష్ణ తెరకెక్కిస్తుండగా ఈ సినిమా టైటిల్ తో పాటు చిన్న వీడియోను కూడా రిలీజ్ చేసారు.”ది ఇండియా హౌస్” పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాను పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించ బోతున్నారు.చూడాలి రామ్ చరణ్ ఈ డిఫరెంట్ సినిమాతో నిర్మాతగా లాభాలను అందుకుంటాడో లేదో.