మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం టాలీవుడ్ ప్రెస్టీజియస్ మూవీ ఆర్ఆర్ఆర్లో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తుండగా, ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో హీరోగా నటిస్తున్నాడు.
ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు జక్కన్న అండ్ టీమ్ రెడీ అవుతున్నారు.కాగా ఈ సినిమా రిలీజ్ కాకముందే, చరణ్ తన నెక్ట్స్ మూవీని ఇప్పటికే అనౌన్స్ చేశాడు.
స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చరణ్ ఓ పాన్ ఇండియా మూవీ చేసేందుకు రెడీ అయ్యాడు.
అయితే ఈ సినిమాకు సంబంధించి ఇండస్ట్రీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో పలు రాకల వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా చరణ్ కోసం శంకర్ ఎలాంటి కథను రెడీ చేస్తున్నాడా అనే అంశంపై కూడా పెద్దగా చర్చ సాగుతోంది.ఈ క్రమంలో చరణ్ కోసం శంకర్ తయారు చేసిన కథకు సంబంధించి ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమా కథను గతంలో వచ్చిన ‘ఒకే ఒక్కడు’ను పోలి ఉంటుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.ఈ సినిమాలో హీరో నిజాయితీగల వ్యక్తిగా ఉంటాడని, ఆయన రాజకీయాల్లోకి వస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది సినిమా కథలా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
గతంలోనూ ‘ఒకే ఒక్కడు’లో నిజాయతీగల విలేకరి అయిన అర్జున్ ఒక్కరోజు ముఖ్యమంత్రిగా మారి ప్రజలకు ఎలా సేవ చేశాడనేది సినిమా కథగా చూపించాడు శంకర్.ఇప్పుడు చరణ్ను కూడా రాజకీయ నాయకుడిగా చూపెట్టనుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అప్పుడే ప్రేక్షకుల్లో నెలకొంది.
ఇక ఈ సినిమా చరణ్ కెరీర్లో 15వ చిత్రంగా వస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తుండగా, ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.