మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా ప్రస్తుతం శంకర్ దర్శకత్వం లో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఆ సినిమా ను నిర్మిస్తున్నాడు.
సాధారణం గా స్టార్ దర్శకులు ఈ మధ్య కాలంలో ఒక సినిమా తర్వాత మరో సినిమా అన్నట్లుగా చేస్తున్నారు.కానీ దర్శకుడు శంకర్ మాత్రం ఒక వైపు రామ్ చరణ్ సినిమా చేస్తూనే మరో వైపు కమల్ హాసన్ తో ఇండియన్ 2 సినిమా ను చేసిన విషయం తెలిసిందే.
మొదట రామ్ చరణ్ సినిమా మాత్రమే అనుకున్నారు, కానీ కొన్ని కారణాల వల్ల ఇండియన్ 2 సినిమా ని కూడా శంకర్ చేయాల్సి వచ్చింది.దాంతో దర్శకుడు శంకర్ ప్రస్తుతం రెండు పడవల ప్రయాణం సాగిస్తున్నాడు.ఈ ప్రయాణం సాఫీ గా సాగుతుందా లేదంటే చివరికి ఏదో ఒక పడవ మునుగుతుందా అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.రామ్ చరణ్ సినిమా పై పూర్తి స్థాయి ఫోకస్ ని దర్శకుడు శంకర్ పెడుతున్నాడా లేదా అంటూ మెగా ఫ్యాన్స్ కంగారుపడుతున్నట్లుగా సోషల్ మీడియా ద్వారా తెలుస్తోంది.
ఇప్పటికే రామ్ చరణ్ సినిమా ను చాలా ఆలస్యం గా విడుదల చేయబోతున్నట్లు కన్ఫర్మ్ అయింది.ఈ సంవత్సరం అసలు రామ్ చరణ్ మరియు శంకర్ కాంబినేషన్ మూవీ విడుదల అవుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇటీవలే వీరి కాంబినేషన్ సినిమా ను వచ్చే సంవత్సరం సంక్రాంతి కి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం మొదలైంది.అదే కనుక నిజమైతే రామ్ చరణ్ అభిమానులు కచ్చితం గా దర్శకుడు శంకర్ పై మరియు నిర్మాత దిల్ రాజు పై ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంది.
గత ఏడాది ఎప్పుడో ప్రారంభమైన సినిమా ను వచ్చే ఏడాది వరకు విడుదల చేయకుండా ఏం చేస్తారంటూ మెగా ఫాన్స్ తిట్టి పోస్తున్నారు.ఇండియన్ 2 మరియు రాంచరణ్ 15 సినిమాల మధ్య మినిమం గ్యాప్ ఉండేలా దర్శకుడు శంకర్ ప్లాన్ చేస్తున్నాడని కూడా సమాచారం అందుతుంది.