‘రంగస్థలం’ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత రామ్ చరణ్ సినిమా అనగానే అంచనాలు భారీగా ఉంటాయి.ప్రతి సినిమాను ముందు సినిమా కంటే బాగా చేయాలని ప్రతి హీరో అనుకుంటాడు.
అలాగే రంగస్థలం కంటే బెటర్ మూవీని చేయాలని రామ్ చరణ్ ప్రస్తుతం ఆశపడుతున్నాడు.తన ఆశను ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాకు దర్శకత్వం వహిస్తున్న బోయపాటి శ్రీనుకు చెబుతున్నాడు.
యాక్షన్ చిత్రాలకు బ్రాండ్ అంబాసిడర్ వంటి దర్శకుడు బోయపాటి.ఈయన దర్శకత్వంలో చరణ్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను చేయడం ఖాయంగా కనిపిస్తుంది.
ఈ సమయంలో ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

చిరంజీవి కెరీర్లో బెస్ట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచే ‘ఇంద్ర’ సినిమాకు ఈ సినిమాకు కాస్త సారుప్యత ఉందని, ఆ సినిమాలో మాదిరిగా ఈ చిత్రంలో కూడా ఒక పవర్ ఫుల్ ఫ్ల్యాష్బ్యాక్ ఎపిసోడ్ను దర్శకుడు బోయపాటి ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.సినిమాలో మొదట రామ్ చరణ్ ఒక సాదారణ యువకుడిగా కనిపిస్తాడు.నలుగురిలో కలిసి పోయి తన వారితో జీవితాన్ని హాయిగా కొనసాగిస్తూ ఉంటాడు.
అలాంటి సమయంలో కొందరు తారస పడటంతో ఆయన గత కథ తెలుస్తుంది.రాజవంశస్తుడు అయ్యి ఉండి, వేల కోట్లకు వారసుడు అయిన రామ్ చరణ్ అలా సాదారణంగా జీవించడం వెనుక ఉద్దేశ్యం ఏంటీ అనేదే కథ.
ఇంద్రలో కూడా చిరంజీవి వారణాసిలో ఒక సాదారణ జీవనం సాగిస్తున్న సమయంలో కొన్ని సంఘటనలు ఆయన గత జీవితాన్ని గుర్తు చేస్తాయి.గత జీవితంలో ఆయన రాయలసీమకు దేవుడు అయిన ఇంద్ర సేనా రెడ్డి అని తెలుసుకుని అంతా షాక్ అవుతారు.
తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పటి వరకు ఇలాంటి పవర్ ఫుల్ ఫ్ల్యాష్బ్యాక్తో సినిమాలు చాలా వచ్చాయి.అందులో ఎక్కువ సినిమాలు మంచి టాక్ను సొంతం చేసుకున్నాయి.అందుకే రామ్ చరణ్ ఈ తరహా స్క్రీన్ప్లేకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.ఒక మంచి స్టోరీ లైన్తో రూపొందుతున్న ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్లో మరో బెస్ట్ చిత్రంగా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.
రామ్ చరణ్కు జోడీగా ఈ చిత్రంలో ‘భరత్ అనే నేను’ చిత్రం హీరోయిన్ కైరా అద్వానీ నటిస్తోంది.ఇంకా ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో వివేక్ ఒబేరాయ్ విలన్గా కనిపించబోతున్నాడు.
‘రంగస్థలం’ చిత్రంలో ప్రెసిడెంట్గా నటించిన జగపతిబాబు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు.మొత్తానికి రామ్ చరణ్తో బోయపాటి శ్రీను ఒక ‘ఇంద్ర’ లాంటి పవర్ ఫుల్ సినిమా తీస్తున్నందుకు ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.