మెగా వారసురాలి కోసం కోట్లు విలువ చేసే బంగారు ఊయల కానుకగా పంపిన అంబానీ!

మెగా వారసురాలు బారసాల వేడుక నేడు ఎంతో ఘనంగా జరుగుతుంది.

ఇప్పటికి ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన గారాలపట్టి నామకరణ వేడుక కూడా జరగబోతున్నట్టు తెలియజేశారు.

ఈ క్రమంలోనే తన కుమార్తె పేరును కూడా నేడు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.ఇక పదేళ్ల తర్వాత మెగా ఇంట్లోకి వారసురాలు అడుగు పెట్టడంతో పెద్ద ఎత్తున ఈ చిన్నారికి కానుకలు పంపిస్తూ ఉన్నారు.

ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున మెగా ప్రిన్సెస్ కోసం కానుకలు పంపించారు.

అయితే ఇండియన్ కుబేరుడుగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ముఖేష్ అంబానీ(Mukesh Ambani) సైతం రామ్ చరణ్ ఉపాసన కుమార్తె కోసం ఖరీదైన బంగారు ఊయలను కానుకగా పంపించారని తెలుస్తోంది.ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రతి ఒక్కరు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఇలా తమ కూతురి కోసం బంగారు ఊయల (Golden Cradel)కానుకగా పంపించడంతో రామ్ చరణ్(Ramcharan) ఉపాసన (Upasana) దంపతులు కూడా ఆశ్చర్యపోయారని తెలుస్తోంది.

Advertisement

బంగారు ఊయల కోసం దాదాపు రెండు కిలోలకు పైగా బంగారం ఉపయోగించారని తెలుస్తోంది.ఈ ఊయల కోసం ముఖేష్ అంబానీ ఏకంగా 1.20 కోట్ల రూపాయలు ఖర్చు చేశారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక నేడు మెగా ప్రిన్సెస్ బారసాల కావడంతో ఈ కానుకను పంపారని తెలుస్తుంది.

ఇక ఈ వేడుక కోసం మెగా కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు ఇతర సెలబ్రిటీలు కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది.ఏది ఏమైనా ముఖేష్ అంబానీ కోట్ల విలువ చేసే బంగారు ఉయ్యాల కానుకగా పంపించడంతో వీరి మధ్య ఎలాంటి అనుబంధం ఉందో తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు