రాజమౌళి క్లారిటి ఇస్తే ఆ హీరోకి నిశ్చింత

బాహుబలి రెండోభాగం ఎప్పుడు విడుదల అవుతుందో అస్సలు క్లారిటి రావట్లేదు.పెరుకైతే 2016 విడుదల అని మొదటిభాగంలోనే ప్రకటించేశారు.

కాని షూటింగ్ లో ఆలస్యం జరగడం ఖాయం అనిపిస్తోంది.ఇక బాహుబలి టీం మెంబర్స్ కూడా 2017లోనే విడుదల ఉండొచ్చు అని చెప్పడంతో ఇక ఈ ఏడాది సినిమా విడుదల కష్టమే అని అనుకున్నారంతా.

కాని రాజమౌళి మళ్ళి కొత్త ట్విస్ట్ ఇచ్చాడు.ఒక హిందీ చానెల్ తో మాట్లాడుతూ ఇంకా ఏది ఫిక్స్ అవలేదు అని, ఈ ఏడాది చివర్లో కాని వచ్చే ఏడాది మొదట్లో కాని చిత్రం విడుదల అవుతుందని చెప్పడంతో, కన్ఫ్యూజన్ ఇంకా పెరిగింది.

అటు ఈ సంవత్సరం రాదనీ చెప్పలేదు, ఖచ్చితంగా వస్తుందని చెప్పలేదు.ఇప్పుడు ఈ అయోమయం వల్ల అందరికన్నా ఎక్కువ ఇబ్బంది పడుతున్నది ఎవరు అంటే అది ఆమీర్ ఖానే.

Advertisement
ఆమీర్ తదుపరి చిత్రం దంగల్ ఈ క్రిస్టమస్ కి ఫిక్స్ అయిపొయింది.క్రిస్టమస్ అనేది ఆమీర్ కి అచ్చొచ్చిన సీజన్.

దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోడు.రాజమౌళి కొత్త స్టేట్ మెంట్ వల్ల దంగల్, బాహుబలి రెండోభాగం పోటిపడుతున్నాయి అని మళ్ళి రచ్చ షురూ చేసింది మీడియా.

ఒకవేళ నిజంగానే దంగల్ తో బాహుబలి పోటిపడితే ఆమీర్ చాలా నష్టపోతాడు.విజయవకాశాల్ని దేబ్బతీయకపోయినా, ఆమీర్ ని రికార్డులు కొట్టకుండా అయితే ఖచ్చితంగా ఆపుతుంది బాహుబలి.

రాజమౌళి మాట కోసం ఎదురుచూస్తున్నాడు ఆమీర్.జక్కన బాహుబలి - ది కంక్లుజన్ మీద క్లారిటి ఇచ్చేస్తే నిశ్చింతగా ఉంటాడు మన మిస్టర్ పర్ఫెక్షనిస్ట్.

వరుస ఫ్లాఫుల తర్వాత హిట్ కొట్టిన హీరోలు ఎవరో తెలుసా?
Advertisement

తాజా వార్తలు