టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది.ఈ సినిమా విడుదల కు ముందే అన్ని రైట్స్ ద్వారా దాదాపుగా 900 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు చేసింది.
నిర్మాత పెట్టిన పెట్టుబడికి ఇది రెట్టింపు కంటే అధికం అంటూ వార్తలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో రాజమౌళి మరియు హీరోల ఇద్దరు పారితోషికాల గురించి ఇంట్రెస్టింగ్ వార్తలు వస్తున్నాయి.
ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కు గాను ఈ ముగ్గురు ఒక ఫిక్డ్స్ పారితోషికంను తీసుకోవడం లేదు.మొదట 50 కోట్ల చొప్పున ముగ్గురు తీసుకున్నారు.
సినిమా విడుదల సమయంలో లాభాల్లో వాటాను వీరు ముగ్గురు తీసుకోబోతున్నారు.ముందుగా ఈ సినిమా విడుదల సమయంలో వీరికి మరో పాతిక కోట్ల వరకు వెళ్లే అవకాశం ఉందని, విడుదల తర్వాత సక్సెస్ అయితే అయిదు పది కోట్లు వస్తాయని అనుకున్నారు.
కాని సినిమా 900 కోట్ల బిజినెస్ చేయడం వల్ల భారీ మొత్తంలో ఆ ముగ్గురు పారితోషికంగా దక్కించుకునే అవకాశం ఉందని అంటున్నారు.
ఇండస్ట్రీ వర్గాల వారు మరియు చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నదాని ప్రకారం సినిమా బడ్జెట్ 400 కోట్ల రూపాయలు తీసి వేయగా 500 కోట్ల రూపాయలు నిర్మాత లాభాలు దక్కించుకున్నట్లు.
అంటే ఆ మొత్తం 500 కోట్ల నుండి నిర్మాత దానయ్య, రాజమౌళి, ఎన్టీఆర్ మరియు చరణ్ లు షేర్ చేసుకోవాల్సి ఉంటుంది.పెట్టుబడి పోను దానయ్యకు వంద కోట్లకు పైగా లాభం వచ్చే అవకాశం ఉంది.
ఇక ఆ ముగ్గురు కలిసి 400 కోట్ల రూపాయలను తమ పారితోషికంగా అందుకుంటారు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.ఇప్పటి వరకు ఇండియన్ సినీ చరిత్రలో మరే దర్శకుడు మరియు హీరోలు దక్కించుకోని పారితోషికంను ఈ ముగ్గురు దక్కించుకోబోతున్నారు.
సినిమా విడుదలై విజయాన్ని సొంతం చేసుకుంటే అప్పుడు లాభాలు మరింత పెరిగే అవకాశం ఉంది.వెయ్యి కోట్ల వసూళ్లు సాధించినా కూడా ఈ ముగ్గురు మరో పాతిక కోట్ల చొప్పున పొందే అవకాశాలు ఉన్నాయంటున్నారు.