విశాఖ శ్రీ శారదాపీఠంలో ప్రారంభమైన రాజ శ్యామల అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు..

విశాఖ శ్రీ శారదాపీఠంలో రాజ శ్యామల అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం అయ్యాయి.పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి, స్వాత్మానందేంద్ర స్వామి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.

మహా గణపతి పూజతో అంకురార్పణ చేశారు.తొలిరోజు రాజశ్యామల అమ్మవారు శ్రీ బాలాత్రిపుర సుందరి అమ్మవారి అవతారంలో దర్శనమిస్తున్నారు.

అమ్మవారి అవతారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.రాజశ్యామల అమ్మవారి నిజరూపానికి పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి చేతుల మీదుగా విశేష అభిషేకం నిర్వహించారు.

లోకకల్యాణార్థం ఈ ఉత్సవాల్లో శ్రీమత్ దేవీ భాగవత పారాయణ యజ్ఞం, చండీ యాగం నిర్వహిస్తోంది విశాఖ శ్రీ శారదాపీఠం.

Advertisement
వైరల్ వీడియో : అయ్యో సింహం ఏంటి ఇలా మోసపోయింది..

తాజా వార్తలు