మహబూబ్ నగర్ మండల శివారునుంచి రాహల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణాలో నాలుగవ రోజు ప్రారంభమైంది.ఈ రోజు 20.3 కి.మీ మేర రాహల్ గాంధీ పాదయాత్ర సాగనుంది.ఎనుగొండలో మధ్యాహ్న భోజన విరామం ఉంటుంది.సాయంత్రం మళ్ళీ మొదలయ్యే యాత్ర జడ్చర్ల చౌరస్తా వద్ద సమావేశంతో ముగియనుంది.మధ్యాహ్నం ఎనుగొండలో విద్యార్థులతో రాహుల్ గాంధీ భేటీ కానున్నారు.