ఏపీ అధికార పార్టీ వైసీపీలో పుట్టిన ముసలం ఏపీ రాజకీయాల్లో పెద్ద సంచలనంగానే మారింది.ఇప్పటికే వైసీపీ వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తో పాటు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తిరుగుబాటు ఎగురవేశారు.
అలాగే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తో పాటు మరికొంతమంది నేతలు పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, త్వరలోనే పెద్ద ఎత్తున టిడిపిలో వైసీపీ నేతలు చేరేందుకు ప్లాన్ చేసుకుంటున్నాట్లుగా జరుగుతున్న ప్రచారం అధికార ప్రతి వైసీపీలో కలవరం పుట్టిస్తుంది.ఈ వలసలను నివారించేందుకు జగన్ ఆగమేఘాల మీద పార్టీకి సమన్వయకర్తలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.
ఎక్కడా, ఎవరిలోనూ అసంతృప్తి తలెత్తకుండా వాటిని పరిష్కరించే విధంగా పార్టీ సీనియర్ నాయకులకు బాధ్యతలను అప్పగించారు.మొత్తంగా వైసీపీలో ఆందోళన పరిణామాలు తలెత్తడంపై ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురాం కృష్ణంరాజు తనదైన శైలిలో స్పందిస్తున్నారు.ఏపీలోని తమ పార్టీలో అవమానాలు దిగమింగుకుంటూ ఉన్న వారంతా ఆత్మగౌరవంతో తిరగబడే రోజులు మొదలయ్యాయి అంటూ రఘురామ కృష్ణంరాజు అన్నారు.ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలతో ఈ తిరుగుబాటు ప్రారంభమైందని రఘురామ ఎద్దేవా చేశారు.
పార్లమెంట్ చట్టం ద్వారానే ఏపీ రాజధాని మార్పు సాధ్యమని మాజీ మంత్రి కొడాలి నాని కూడా గ్రహించారని రఘు రామ అన్నారు.
సుప్రీంకోర్టులో తమకు అనుకూలంగా తీర్పు రాకపోతే , రాబోయే ఎన్నికల్లో 175 శాసనసభ స్థానాలు , 25 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుని కేంద్రంతో పార్లమెంటులో బిల్లు పెట్టించి విశాఖను రాజధానిగా చేస్తామంటూ ఆయన గుర్తు చేశారు.తనను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి, కేసులు పెట్టిన వైసీపీలో ఈ తరహా పరిణామాలు చోటు చేసుకోవడం పై రఘురామ మరింత ఆనందంలో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు.