తెలుగులో తక్కువ సినిమాలే చేసినా వివాదాల ద్వారా ఎక్కువగా వార్తల్లో నిలిచిన హీరోయిన్లలో రాధికా ఆప్టే( Radhika Apte ) ఒకరు.ఊహించని స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ ఉన్న ఈ బ్యూటీ టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీ గురించి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో నేను చాలా కష్టపడ్డానని ఆమె అన్నారు.తెలుగు సినిమాలలో హీరోయిన్లను చూసే విధానం దారుణమని ఆమె చెప్పుకొచ్చారు.
తెలుగు సినిమాలలో హీరోయిన్ రోల్స్ కు పెద్దగా ప్రాధాన్యత ఉండదని రాధికా ఆప్టే చెప్పుకొచ్చారు.హీరోయిన్ ను సెట్ లో మూడవ వ్యక్తిగా ట్రీట్ చేస్తారని ఆమె కామెంట్లు చేశారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో పురుషా ఆధిపత్యం ఎక్కువని రాధికా ఆప్టే వెల్లడించారు.టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇతర నటీనటులను అడగకుండా ఇష్టానుసారం షూట్ ను రద్దు చేస్తారని ఆమె అభిప్రాయపడ్డారు.
ఇలా చేయడం వల్ల నాకు చాలాసార్లు ఇబ్బందులు ఎదురయ్యాయని రాధికా ఆప్టే తెలిపారు.
కానీ దానికి అక్కడే ఎండ్ కార్డ్ పడిందని అక్కడ నా అవసరం అంతవరకే అని నేను గ్రహించానని రాధికా ఆప్టే చెప్పుకొచ్చారు.అయితే రాధికా ఆప్టే చేసిన కామెంట్లపై నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.తెలుగు ఇండస్ట్రీ గురించి ఇష్టానుసారం కామెంట్లు చేయడం రైట్ కాదని రాధికను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.రక్తచరిత్ర1, రక్తచరిత్ర2, లెజెండ్, లయన్, ధోని సినిమాలలో ఆమె నటించిందని నెటిజన్లు చెబుతున్నారు.
చేదు అనుభవాలు ఎదురై ఉంటే 5 సినిమాలు ఎలా చేసిందని మరి కొందరు ప్రశ్నిస్తున్నారు.మరి కొందరు మాత్రం ఆమె ఇంత ఘాటుగా రియాక్ట్ అయ్యారంటే బలమైన కారణం ఉండి ఉంటుందని చెబుతున్నారు.రాధికా ఆప్టే ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం.
భవిష్యత్తులో రాధికకు తెలుగు సినిమాల్లో ఆఫర్లు వచ్చే ఛాన్స్ అయితే లేదు.