సెల్ ఫోన్స్ పగిలిపోతాయంటూ పుష్ప టీమ్ స్ట్రాంగ్ వార్నింగ్.. కారణం?

అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్నటువంటి "పుష్ప" సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ సినిమా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కడంతో ఇందులో అల్లుఅర్జున్ లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో నటిస్తున్నారు.

ఇక ఇందులో అల్లు అర్జున్ సరసన కథానాయికగా రష్మిక ఓ గిరిజన యువతి పాత్రలో కనిపించనున్నారు.ప్రస్తుతం షూటింగ్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో ఎన్నో సన్నివేశాలను లీకు రాయుళ్లు లీక్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం.

అయితే ఈ లీకుల విషయంపై చిత్రబృందం ఎన్నోసార్లు స్పందించి గట్టిగా వార్నింగ్ ఇచ్చినప్పటికీ ఈ లీకుల పర్వం మాత్రం ఆగడంలేదు.ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ సినిమా అవుట్ డోర్ షూటింగ్స్ లో ఉండటం వల్ల ఈ విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున షూటింగ్ స్పాట్ కి చేరుకోవడంతో అభిమానులను కంట్రోల్ చేయడం చిత్ర బృందానికి పెద్ద సవాల్ గా మారిపోయింది.

ఈ క్రమంలోనే షూటింగ్ లోకేషన్ కు వచ్చిన చాలామంది అభిమానులు సెల్ ఫోన్ ల ద్వారా అక్కడ జరిగేటువంటి సన్నివేశాలను చిత్రీకరించి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

Advertisement

ఈ క్రమంలో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.తాజాగా ఈ సినిమాలో బన్నీ నడుపుతున్నటువంటి లారీకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫోటో ఉందంటూ ఆ లారీ ఫోటోను అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేశారు.ఇలా సినిమాకు సంబంధించిన చాలా విషయాలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టడంతో వీటన్నింటిని ఆపడానికి చిత్రబృందం సరికొత్త ఆలోచనను చేశారు.

ఈ క్రమంలోనే షూటింగ్ లొకేషన్ లో ఎవరైనా సెల్ ఫోన్ లో ఫోటోలు, వీడియోలు చిత్రీకరిస్తే సెల్ ఫోన్స్ పగిలిపోతాయంటూ.బోర్డులు పెట్టారు.అయితే చిత్రబృందం ఈ విధంగా బోర్డులు పెట్టినప్పటికీ అభిమానులు మాత్రం వీడియోలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు