పూరీ జగన్నాథ్.విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్నా సినిమా లైగర్.
ఈ సినిమాతో ఇద్దరు బాక్సాఫీస్ పై యుద్ధానికి రెడీ అవుతున్నారు.పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ అదిరిపోయింది.
లైగర్ సినిమా కోసం విజయ్ దేవరకొండ 2 ఏళ్లు పూరీకి రాసిచ్చాడు.అఫ్కోర్స్ పూరీ కెరియర్ లో ఎక్కువ రోజులు షూటింగ్ జరుపుకున్న సినిమా కూడా ఇదే అని చెప్పొచ్చు.
అందుకే విజయ్ దేవరకొండతో మరో సినిమా ఫిక్స్ చేసుకున్నాడట పూరీ జగన్నాథ్.
పూరీ, విజయ్ లైగర్ తర్వాత మరో సినిమా చేస్తారని టాక్.
లైగర్ రిలీజ్ తర్వాత వెంటనే మళ్లీ ఇదే కాంబో రిపీట్ అవుతుందని అంటున్నారు.అసలైతే విజయ్ తన నెక్స్ట్ సినిమా సుకుమార్ తో చేయాల్సి ఉంది.
శివ నిర్వాణతో కూడా ఒక సినిమా లైన్ లో పెట్టాడు.మరి విజయ్ పూరీ మరోసారి ఈ కాంబో రిపీట్ అవడం రౌడీ ఫ్యాన్స్ కు సూపర్ సర్ ప్రైజ్ అని చెప్పొచ్చు.
లైగర్ తర్వాత పూరీ కూడా ఇస్మార్ట్ శంకర్ సీక్వల్ గా ఓ సినిమా అనుకున్నాడు.